ప్రధాన మంత్రి కార్యాలయం

గాయకుడు కైలాష్ ఖేర్ కొత్త గీతం ‘కాశీ స్తుతి’ కి ప్రధాని ప్రశంస

Posted On: 10 DEC 2023 9:36AM by PIB Hyderabad

కాశీ విశ్వనాథుని స్తుతిస్తూ గాయకుడు కైలాష్ ఖేర్‌ ఆలపించిన కొత్త గీతం ‘కాశీ స్తుతి’ని ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు. అక్షయం, అజరామరమైన మహిమాన్విత కాశీ నగరానికి శ్రీ మోదీ శిరసాభివందనం చేస్తూ- అపార భక్తిశ్రద్ధలతో కాశీ పవిత్రతను, ప్రాశస్త్యాన్ని స్తుతిస్తూ రచించిన ఈ గీతం ఎంతో మనోహరంగా ఉందని కొనియాడారు.

 

గీతం గురించి కైలాష్ ఖేర్ ‘ఎక్స్‌’ పోస్టుపై స్పందిస్తూ ప్రధానమంత్రి పంపిన సందేశంలో:

 

“అక్షయం, అజరామరమైన మహిమాన్విత కాశీ నగరానికి అనేకానేక వందనాలు! నిండైన భక్తిశ్రద్ధలతో కూడిన మీ గీతం నన్నెంతో ఆకట్టుకుంది. జై కాశీ విశ్వనాథ!” అని ప్రశంసించారు.

******



(Release ID: 1985879) Visitor Counter : 66