ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆయుర్వేద కుసమర్థన ను ఇవ్వడం అనేది వోకల్ ఫార్ లోకల్ ను బలపరచే ఒక చైతన్యవంతం అయినటువంటిఉదాహరణ గా ఉంది : ప్రధాన మంత్రి


ఆయుర్వేద దినంనాడు నూతన ఆవిష్కర్తల కు మరియు ఆయుర్వేద ఆధారిత చికిత్స వృత్తి లో ఉన్న వారి కి  నమస్కరించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 10 NOV 2023 6:31PM by PIB Hyderabad

ఆయుర్వేదాని కి సమర్థన ను ఇవ్వడం వోకల్ ఫార్ లోకల్ ను బలపరచే ఒక చైతన్యభరితం అయినటువంటి ఉదాహరణ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రాచీనమైనటువంటి జ్ఞ‌ానాన్ని ఆధునికత్వం తో మేళవిస్తూ మరి ఆయుర్వేదాన్ని ప్రపంచం అంతటా సరిక్రొత్త శిఖరాల కు చేర్చుతున్న నూతన ఆవిష్కర్తల ను మరియు ఆయుర్వేద ఆధారిత చికిత్స వృత్తి లో ఉన్న వారి ని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.


ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో -

‘‘మంగళప్రదం అయినటువంటి ధన్ తేరస్ నాడు, మనం ఆయుర్వేద దినాన్ని కూడ జరుపుకొంటున్నాం. ఇది ఈ యొక్క ప్రాచీన జ్ఞ‌ానాన్ని ఆధునికత్వం తో మేళవిస్తూ ఆయుర్వేదాన్ని ప్రపంచ వ్యాప్తం గా క్రొత్త శిఖరాల కు చేర్చుతున్నటువంటి నూతన ఆవిష్కర్తల కు మరియు ఆయుర్వేదం వృత్తి లో ఉన్న వారి ని ప్రశంసించవలసిన సందర్భం కూడాను. ఇదివరకు ఎరుగని అటువంటి పరిశోధన లు మొదలుకొని హుషారైనటువంటి స్టార్ట్- అప్ స్ వరకు చూస్తే, ఆయుర్వేదం వెల్ నెస్ తాలూకు క్రొత్తవైన దారుల ను పరుస్తున్నది. ఆయుర్వేదాన్ని సమర్థించడం కూడ వోకల్ ఫార్ లోకల్ ను బలపరచే ఒక చైతన్యభరితం అయినటువంటి ఉదాహరణే అని చెప్పవచ్చును.’’ అని పేర్కొన్నారు.

 

 


(రిలీజ్ ఐడి: 1976673) సందర్శకుల సూచీ సంఖ్య : : 171