ప్రధాన మంత్రి కార్యాలయం

పారా ఆసియా క్రీడలు 2022లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఎస్ఎల్3 ఈవెంట్‌లో మన్‌దీప్ కౌర్ కాంస్య పతకాన్ని సాధించిన సందర్భంగా ప్రధాన మంత్రి అభినందనలు

Posted On: 25 OCT 2023 6:55PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియా క్రీడలు 2022లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఎస్ఎల్3 ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మన్‌దీప్ కౌర్‌ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి X లో పోస్ట్ చేసారు:

“ఆసియన్ పారా గేమ్స్‌లో మహిళల సింగిల్స్ ఎస్ఎల్3లో మన్‌దీప్ కౌర్ కాంస్య పతకాన్ని సాధించడం ద్వారా ఆమె అద్భుతమైన విజయం సాధించింది. ఆమెకు అభినందనలు, ఆమె భవిష్యత్ ప్రయత్నాలు సఫలం అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను " అని ప్రధానమంత్రి సందేశంలో పేర్కొన్నారు. 



(Release ID: 1971768) Visitor Counter : 56