ప్రధాన మంత్రి కార్యాలయం

ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి విశేష స్పందనపై ప్రధాని ప్రశంస

Posted On: 16 OCT 2023 8:31PM by PIB Hyderabad

   యుష్మాన్‌ భవ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం కింద 80,000 మందికిపైగా ప్రజలు అవయవ దానానికి ప్రతినబూనడం ఈ కార్యక్రమ విజయానికి తిరుగులేని నిదర్శనమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రశంసించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“అవయవ దానంపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రజా స్పందన నాకు ఎనలేని సంతోషం కలిగిస్తోంది! ప్రాణరక్షణ దిశగా ఇదొక కీలక ముందడుగని చెప్పడంలో సందేహం లేదు. భవిష్యత్తులో మరింత పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఉదాత్త కృషికి తమవంతు తోడ్పాటునందిస్తారని ఆశిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1968292) Visitor Counter : 68