ప్రధాన మంత్రి కార్యాలయం
రాన్ ఉత్సవ్ తిలకించాల్సిందిగా అమితాబ్ బచ్చన్ను కోరిన ప్రధాన మంత్రి
Posted On:
15 OCT 2023 5:22PM by PIB Hyderabad
గుజరాత్లో నిర్వహించే రాన్ ఉత్సవ్ను తిలకించాల్సిందిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హిందీ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్ను కోరారు. దీంతోపాటు ఐక్యతా విగ్రహం పర్యాటక ప్రాంతాన్ని కూడా సందర్శించాలని సూచించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“పార్వతీ కుండ్, జగేశ్వర్ ఆలయాల సందర్శన ఎంతో అద్భుతం.. ఆ వైభవం చూసి నేను అప్రతిభుడనయ్యాను. ఇక కొద్దిరోజుల్లో రాన్ ఉత్సవ్ ప్రారంభం కాబోతోంది. ఈ వేడుకలను తిలకించడం కోసం కచ్ను సందర్శించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఐక్యతా విగ్రహం పర్యాటక ప్రాంతానికీ వెళ్లాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1967987)
Visitor Counter : 118
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam