ప్రధాన మంత్రి కార్యాలయం

ఛత్రపతి శంభాజీనగర్ ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం


ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటన

Posted On: 15 OCT 2023 9:31AM by PIB Hyderabad

   హారాష్ట్ర‌లోని ఛ‌త్ర‌ప‌తి శంభాజీ న‌గ‌ర్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి రూ.2 లక్షలు, రూ.50వేల వంతున పరిహారం ప్రకటించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం పంపిన సందేశంలో:

“ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో సంభవించిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం నన్నెంతో బాధించింది. ఆత్మీయులను కోల్పోయిన బాధితులకు ఈ విషాద సమయంలో నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ నేపథ్యంలో ‘పిఎంఎన్‌ఆర్‌ఎఫ్’ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం అందజేయబడుతుంది: PM @narendramodi” అని పేర్కొంది.



(Release ID: 1967860) Visitor Counter : 75