ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం-2023 సందర్భంగా మానసిక ఆరోగ్య సదస్సులో వర్చువల్ గా కీలకోపన్యాసం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


నింహాన్స్ (ఎన్ ఐ ఎం హెచ్ ఎ ఎన్ ఎస్) లో నూతన సౌకర్యాలను ప్రారంభించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ: టెలీ మానస్ కొత్త లోగో ఆవిష్కరణ

"మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కు"

మానసిక ఆరోగ్యంలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఒక శక్తి గుణకం. టెలీ మానస్ ఇప్పటి వరకు 3,50,000 మందికి కౌన్సిలింగ్ ఇవ్వగా, ప్రస్తుతం 44 టెలీ మానస్ సెల్స్ ద్వారా 2000 మందికి కౌన్సిలింగ్ ఇస్తోంది: ఈ హెల్ప్ లైన్ కు ప్రతిరోజూ వెయ్యికి పైగా కాల్స్ వస్తున్నాయి: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

“ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు మానసిక ఆరోగ్యం, నరాల సంబంధిత రుగ్మతలు , పదార్థ వినియోగ రుగ్మతలకు ప్రాధాన్యతా సేవలుగా మానసిక ఆరోగ్య సేవలను ప్రాథమిక ఆరోగ్య సేవలతో అనుసంధానించడానికి దోహద పడ్డాయి”

Posted On: 10 OCT 2023 4:00PM by PIB Hyderabad

“మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కు." అని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ మానసిక ఆరోగ్య సదస్సులో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈ నిమ్హాన్స్ లో నూతన సౌకర్యాలను వర్చువల్ గా ప్రారంభించి టెలీ మానస్ లోగోను ఆవిష్కరించారు. ఆయనతో పాటు నీతి ఆయోగ్ సభ్యుడు (సభ్యుడు) డాక్టర్ వి కె పాల్ కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ, మానసిక ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు దేశంలోని పౌరులందరికీ అందుబాటులో ఉండేలా, మారుమూల ప్రాంతాలకు చేరేలా కృషి చేయాలనే సంకల్పాన్ని ప్రశంసించారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వాన్ని కొనియాడుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి, "2015-16 సంవత్సరంలో ప్రచురించబడిన జాతీయ మానసిక ఆరోగ్య సర్వే ఒక మార్గదర్శక చొరవ, ఇది జనాభాలో 10 శాతం మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వెలుగులోకి తెచ్చింది, ఇది ప్రభావిత ప్రజల పైన, సమాజం పైన, ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపే అమిత భారాన్ని ప్రతిబింబిస్తుంది” అన్నారు.  నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (టెలీ- మానస్) ఉదాహరణను ఉటంకిస్తూ, "మానసిక ఆరోగ్య సంరక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఒక శక్తి గుణకం" అని కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గత ఏడాది ప్రారంభించిన టెలీ మానస్ సేవలో ఇప్పటి వరకు 3,50,000 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని, ప్రస్తుతం 44 టెలీ మానస్ సెల్స్ ద్వారా 2000 మందికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఈ హెల్ప్ లైన్ కు రోజుకు వెయ్యికి పైగా కాల్స్ వస్తున్నాయని తెలిపారు. .

టెలీ మానస్ లోగోను ఆవిష్కరించిన కేంద్ర ఆరోగ్య మంత్రి,  బెంగళూరులోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ లో ప్లాటినం జూబ్లీ ఆడిటోరియం, అకడమిక్ ఫెసిలిటీ, నిమ్హాన్స్ లో న్యూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కాంప్లెక్స్, సెంటర్ ఫర్ బ్రెయిన్ అండ్ మైండ్ వంటి నూతన సౌకర్యాలను ప్రారంభించారు.

ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు మానసిక ఆరోగ్యం, నరాల సంబంధిత రుగ్మతలు , పదార్థ వినియోగ రుగ్మతలకు ప్రాధాన్యతా సేవలుగా మానసిక ఆరోగ్య సేవలను ప్రాధమిక ఆరోగ్య సేవలతో అనుసంధానించడానికి వీలు కల్పించాయని కేంద్ర ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. ‘‘జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక జిల్లా మానసిక ఆరోగ్య ఇంటర్వెన్షన్ బృందం జిల్లా స్థాయి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. అదనంగా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో మానసిక ఆరోగ్య సమస్యలకు ఓపిడి, కౌన్సిలింగ్, సంరక్షణ ,వైద్య సహాయం అందిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 1.6 లక్షల ఎ బి - హెచ్ డబ్ల్యూ సి ల ద్వారా వీటిని అందిస్తున్నారు. ప్రధాన మంత్రి-జన్ ఆరోగ్య యోజన కింద మానసిక ఆరోగ్యం కూడా ఉంది‘‘ అన్నారు.

"కవరేజీ , మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడానికి, మొత్తం 36 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 743 జిల్లాల్లో జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం కింద జిల్లా స్థాయి కార్యకలాపాలకు మద్దతు ఇచ్చారు" అని డాక్టర్ మాండవీయ తెలిపారు. తృతీయ స్థాయిలో దేశంలో మొత్తం 47 ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రులు ఉన్నాయని, వీటిలో బెంగళూరు, రాంచీ, తేజస్ పూర్ లో మూడు కేంద్ర మానసిక ఆరోగ్య సంస్థలు ఉన్నాయని ఆయన వివరించారు. అనేక ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైకియాట్రీ విభాగాలు ఉన్నాయి. వీటితో పాటు కొత్తగా ఏర్పాటైన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో సైకియాట్రీ విభాగాలను ఏర్పాటు చేశారు.

డాక్టర్ మాండవీయ రాష్ట్రాల పనితీరును ప్రస్తావించారు. నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ లో అత్యధిక సంఖ్యలో కాల్స్ సాధించినందుకు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు జ్ఞాపికతో ప్రశంసా పత్రాన్ని అందజేశారు. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్నాయి.  చిన్న రాష్ట్రాల కేటగిరీలో ప్రతిభ కనబరిచిన తెలంగాణ, జార్ఖండ్, కేరళ రాష్ట్రాలకు అవార్డులు దక్కాయి. ఈశాన్య కేటగిరీలో అస్సాం, మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాల కేటగిరీలో జమ్ముకశ్మీర్, ఢిల్లీ, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలకు అవార్డులు లభించాయి.

అవగాహన పెంచడానికి , ఆరోగ్య సేవలను చివరి మైలు వరకు అందించడానికి ప్రభుత్వ నిబద్ధత , సంకల్పాన్ని ప్రస్తావిస్తూ, "టెలీ-మనాస్ తో పాటు, నేషనల్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్, నేషనల్ కౌమార ఆరోగ్య కార్యక్రమం,  ఆర్ సిహెచ్ కార్యక్రమాల కింద పిల్లలు,  మహిళల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఆయుర్దాయం పెరుగుతున్న కొద్దీ వృద్ధుల మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి సారిస్తున్నామని”  అన్నారు. మాదకద్రవ్యాల వ్యసనం, పని ఒత్తిడి మానసిక ఆరోగ్య సమస్యలకు గణనీయమైన దోహదం చేస్తాయని పేర్కొంటూ,  ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ చేరేలా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆయన కోరారు.

మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత ,  ప్రభావాన్ని ప్రముఖంగా చెబుతూడాక్టర్ పాల్,  "మానసిక ఆరోగ్యం అస్పష్టత కొన్ని విధాలుగా వ్యక్తులు, కుటుంబాలు ,మొదలైన వారిని చేరుకోవడంలో మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది, అయితే అదే సమయంలో దేశ ఉత్పాదకత, శ్రేయస్సు, సామాజిక సమతుల్యత కూడా మానసికంగా , ఆధ్యాత్మికంగా మంచి అనుభూతితో సంక్లిష్టంగా ముడిపడి ఉందని మనం మర్చిపోకూడదు” అన్నారు.  "మొత్తం సమాజ విధానం, అంటే జన ఆందోళన్ విధానం, బాధితులకు సహాయం చేయడంలో , సంరక్షణను అందించడంలో అపారమైన పరపతిని జోడిస్తుంది" అని ఆయన చెప్పారు.

వికలాంగుల సాధికారత శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్, పాఠశాల విద్య , అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ జనరల్ డాక్టర్ భరత్ లాల్, ఆరోగ్య -కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎఎస్ అండ్  ఎండి (ఎన్ హెచ్ ఎం) శ్రీమతి ఎల్ఎస్ చాంగ్సెన్, ఆరోగ్య -కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు శ్రీమతి ఇంద్రాణి కౌశల్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బి.ఎన్.  గంగాధర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమామూర్తి, ఏవీఎస్ఎం, వీఎస్ఎం, పీహెచ్ఎస్, డి జి ఎ ఎఫ్ ఎంఎస్ లెఫ్టినెంట్ జనరల్ దల్జీత్ సింగ్, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రతినిధి డాక్టర్ రోడెరికో హెచ్ ఆఫ్రిన్, ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) చైర్ పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ వర్చువల్ గా పాల్గొన్నారు.

 ****



(Release ID: 1966875) Visitor Counter : 39