మంత్రిమండలి
azadi ka amrit mahotsav

స్వయంప్రతిపత్త సంస్థ "మేరా యువ భారత్‌" ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

प्रविष्टि तिथि: 11 OCT 2023 3:17PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం యువత అభివృద్ధి మరియు యువత సారథ్యంలోని అభివృద్ధికి మరియు యువతకు సమానమైన అవకాశాలను అందించడానికి సాంకేతికతతో ఆధారితమైన ఒక విస్తృతమైన ఎనేబుల్ మెకానిజమ్‌గా పనిచేయడానికి స్వయంప్రతిపత్త సంస్థ "మేరా యువ భారత్ (మై భారత్) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. యువత ఆకాంక్షలను సాకారం చేయడానికి మరియు ప్రభుత్వ స్పెక్ట్రం అంతటా విక్షిత్ భారత్‌ను నిర్మించడానికి ఇది సహాయపడుతుంది.

ప్రభావం:
మేరా యువ భారత్ (మైభారత్) ప్రాథమిక లక్ష్యం యువత అభివృద్ధికి ప్రభుత్వ వేదికగా మార్చడం. కొత్త విధానం ప్రకారం వనరులను  అవకాశాల అనుసంధానంతో యువత కమ్యూనిటీ మార్పు ఏజెంట్లు మరియు దేశాన్ని నిర్మించేవారుగా మారతారు. తద్వారా వారు ప్రభుత్వం మరియు పౌరుల మధ్య యువ సేతుగా పని చేయవచ్చు. ఇది దేశ నిర్మాణానికి అపారమైన యువశక్తిని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తుంది.

వివరాలు:
మేరా యువ భారత్ (మైభారత్) స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. జాతీయ యువజన విధానంలో ‘యువత’ నిర్వచనానికి అనుగుణంగా 15-29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతకు ప్రయోజనం చేకూరుస్తుంది. యుక్తవయస్కుల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన ప్రోగ్రామ్ భాగాల విషయంలో లబ్ధిదారులు 10-19 సంవత్సరాల వయస్సు-సమూహంలో ఉంటారు.

మేరా యువ భారత్ (మైభారత్) ఈ కింది అంశాల స్థాపనకు దారి తీస్తుంది:

ఎ. యువతలో నాయకత్వ అభివృద్ధి

 

  1. భౌతిక పరస్పర చర్య నుండి ప్రోగ్రామాటిక్ నైపుణ్యాలకు మారడం ద్వారా అనుభవపూర్వక అభ్యాసం ద్వారా నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరచడం
  2. యువతను సామాజిక ఆవిష్కర్తలుగా, సంఘాల్లో నాయకులుగా మార్చేందుకు వారిపై ఎక్కువ పెట్టుబడి పెట్టడం.
  3. యూత్ లీడ్ డెవలప్‌మెంట్‌పై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించడం మరియు యువతను కేవలం "నిష్క్రియ గ్రహీతలు"గా కాకుండా అభివృద్ధికి "యాక్టివ్ డ్రైవర్‌లుగా" చేయడం.

బి. యువత ఆకాంక్షలు మరియు సమాజ అవసరాల మధ్య మెరుగైన అమరిక.
సి. ఇప్పటికే ఉన్న ప్రోగ్రామ్‌ల కన్వర్జెన్స్ ద్వారా మెరుగైన సామర్థ్యం.
డి. యువకులు మరియు మంత్రిత్వ శాఖలకు ఒక స్టాప్ షాప్‌గా వ్యవహరించడం
ఈ. కేంద్రీకృత యువత డేటా బేస్‌ను సృష్టించడం
ఎఫ్‌. ప్రభుత్వ కార్యక్రమాలు మరియు యువతతో నిమగ్నమయ్యే ఇతర వాటాదారుల కార్యకలాపాలను అనుసంధానించడానికి రెండు-మార్గం కమ్యూనికేషన్ మెరుగుపరచబడింది.
జి. ప్రాప్యతను నిర్ధారించడం మరియు భౌతిక పర్యావరణ వ్యవస్థను సృష్టించడం.

నేపథ్యం:
అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్లు, సోషల్ మీడియా, కొత్త డిజిటల్ అవకాశాలు మరియు ఎమర్జెన్సీ టెక్నాలజీల వాతావరణంతో వేగంగా మారుతున్న ప్రపంచంలో 'పూర్తి ప్రభుత్వ విధానం' సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేయబడే యువతను మరియు వారి సాధికారతని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయించింది. మేరా యువ భారత్ (మైభారత్) అనే కొత్త అటానమస్ బాడీ రూపంలో విస్తృతమైన ఎనేబుల్ మెకానిజం ఏర్పాటువుతుంది.

 

***


(रिलीज़ आईडी: 1966702) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil