ప్రధాన మంత్రి కార్యాలయం

ఇజ్రాయిల్ లో ఉగ్రవాద దాడుల వార్తలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ప్రస్తుత క్లిష్ట సమయంలో ఇండియా, ఇజ్రాయిల్కు సంఘీభావం తెలుపుతున్నది : ప్రధానమంత్రి

Posted On: 07 OCT 2023 5:27PM by PIB Hyderabad

ఇజ్రాయిల్ లో ఉగ్రవాదుల దాడుల వార్తలపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో ఇండియా, ఇజ్రాయిల్ కు సంఘీభావం తెలుపుతున్నదని ప్రధానమంత్రి తెలిపారు.
తమ ఆలోచనలన్నీ అమాయక బాధితులు, వారి కుటుంబాల చుట్టూ తిరుగుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు.
ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి , సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఒక పోస్ట్ పెడుతూ, “ఇజ్రాయిల్ లో ఉగ్రవాద దాడుల వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను.
మా ఆలోచనలు, ప్రార్థనలు అమాయకులైన బాధితులు వారి కుటుంబాల వెంట ఉన్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో మేం ఇజ్రాయిల్ కు అండగా ఉ న్నాం”అని ఆయన పేర్కొన్నారు.

***** 

DS/TS



(Release ID: 1965634) Visitor Counter : 97