ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల కబడ్డీలో చారిత్రక స్వర్ణ సాధనపై భారత మహిళా జట్టుకు ప్రధానమంత్రి అభినందన

प्रविष्टि तिथि: 07 OCT 2023 8:42AM by PIB Hyderabad

   సియా క్రీడల కబడ్డీలో భారత మహిళల జట్టు చారిత్రక విజయంతో స్వర్ణ పతకం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదొక చారిత్రక ఘట్టం. మన మహిళల కబడ్డీ జట్టు తిరుగులేని పోరాట పటిమ ప్రదర్శించి స్వర్ణం కైవసం చేసుకుంది! ఈ విజయం మన మహిళా క్రీడాకారుల పోరాట స్ఫూర్తికి నిదర్శనం. దీనిపై యావద్దేశం గర్వంతో ఉప్పొంగుతోంది. మన జట్టుకు నా శుభాభినందనలు. భవిష్యత్తులోనూ ఈ విజయ పరంపరను కొనసాగించాలని ఆకాంక్షిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS


(रिलीज़ आईडी: 1965319) आगंतुक पटल : 148
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil