ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల కబడ్డీలో చారిత్రక స్వర్ణ సాధనపై భారత మహిళా జట్టుకు ప్రధానమంత్రి అభినందన

Posted On: 07 OCT 2023 8:42AM by PIB Hyderabad

   సియా క్రీడల కబడ్డీలో భారత మహిళల జట్టు చారిత్రక విజయంతో స్వర్ణ పతకం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదొక చారిత్రక ఘట్టం. మన మహిళల కబడ్డీ జట్టు తిరుగులేని పోరాట పటిమ ప్రదర్శించి స్వర్ణం కైవసం చేసుకుంది! ఈ విజయం మన మహిళా క్రీడాకారుల పోరాట స్ఫూర్తికి నిదర్శనం. దీనిపై యావద్దేశం గర్వంతో ఉప్పొంగుతోంది. మన జట్టుకు నా శుభాభినందనలు. భవిష్యత్తులోనూ ఈ విజయ పరంపరను కొనసాగించాలని ఆకాంక్షిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS



(Release ID: 1965319) Visitor Counter : 103