ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల మహిళల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన పర్వీన్ హూడాకు ప్రధాని అభినందన

Posted On: 04 OCT 2023 7:17PM by PIB Hyderabad

   సియా క్రీడ‌ల‌ మ‌హిళ‌ల బాక్సింగ్‌ 57 కిలోల విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించిన భారత బాక్స‌ర్ పర్వీన్‌ హూడాను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“బాక్సింగ్‌లో మనకు మరో పతకం! మహిళల 57 కిలోల విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న బాక్సర్‌ హూడా @BoxerHoodaను అభినందిస్తున్నాను. ఈ పతకం ఆమె కఠోర పరిశ్రమకు దక్కిన ప్రతిఫలం. భవిష్యత్తులో ఆమె మరింత ముందుకు దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1964506) Visitor Counter : 102