ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్ లోని భరత్ పుర్ లో రోడ్డు దుర్ఘటన కారణం గాప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందిఅని ప్రకటించారు
Posted On:
13 SEP 2023 1:31PM by PIB Hyderabad
రాజస్థాన్ లోని భరత్ పుర్ లో ఒక రోడ్డు దుర్ఘటన జరిగి ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిది (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున, గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘రాజస్థాన్ లోని భరత్ పుర్ లో జరిగిన రహదారి దుర్ఘటన అత్యంత దుఃఖదాయకం గా ఉంది. గుజరాత్ నుండి ధార్మిక యాత్ర కు వెళ్ళిన భక్తులు ఈ దుర్ఘటన లో వారి ప్రాణాల ను కోల్పోయారు, వారి దగ్గరి సంబంధికుల కు ఇదే నా సంతాపం. దీనితో పాటు ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారందరు త్వరిత గతి న పునఃస్వస్థులు అవ్వాలని కోరుకొంటున్నాను.’’
‘‘భరత్ పుర్ లో జరిగిన దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లించేందుకు ప్రధాన మంత్రి ఆమోదం తెలియ జేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది’’ అని తెలిపింది.
***
DS/TS
(Release ID: 1956897)
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam