ప్రధాన మంత్రి కార్యాలయం

స్వాతంత్ర్యదినం సందర్బం లో ప్రధాన మంత్రి ఇచ్చిన ఉపన్యాసాన్ని ప్రశంసించిన అన్ని వర్గాల కు చెందిన ప్రముఖ పౌరులు

Posted On: 15 AUG 2023 1:33PM by PIB Hyderabad

ఈ రోజు న స్వాతంత్ర్య దినం సందర్భం లో ప్రధాన మంత్రి ఎర్ర కోట బురుజుల మీద నుండి ఇచ్చిన ఉపన్యాసాన్ని వివిధ రంగాల కు చెందిన పలువురు ప్రముఖ భారతీయులు ప్రశంసించారు. పద్మ పురస్కార గ్రహీత, విద్య వేత్త లు, సాంకేతిక విజ్ఞ‌ాన రంగం లోని ప్రముఖులు, వ్యాపార రంగ ప్రముఖులు, ప్రసిద్ధ మహిళా వృత్తినిపుణులు, నటీనటులు మరియు క్రీడాకారులు ఆ ఉపన్యాసం లో వ్యక్తం అయినటువంటి దృష్టి కోణాన్ని పొగడుతూ మాట్లాడారు.

భారతదేశం లో సూక్ష్మ, లఘు, మధ్యతరహా వాణిజ్య సంస్థల సంబంధి సముదాయం లో డెమోగ్రఫి, డిమాక్రసి మరియు డైవర్సిటి అనే మూడు ‘డి’ ల విషయం లో ప్రధాన మంత్రి యొక్క అభిప్రాయాలు బలే బాగున్నాయి అని ఎఫ్ఐఎస్ఎమ్ఇ సెక్రట్రి జనరల్ శ్రీ అనిల్ భరద్వాజ్ అన్నారు.

వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) తాలూకు దృష్టికోణాన్ని సిఐఐ యొక్క డిజి శ్రీ చంద్రజీత్ బనర్జీ ప్రశంసించారు.

భారతదేశం త్వరలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఉనికి లోకి వస్తుందన్న ఆశావాదాన్ని ఇండియా రిసర్చ్ సిఎల్ఎస్ఎ యొక్క అధిపతి శ్రీ ఇంద్రనీల్ సేన్ గుప్త వ్యక్తం చేశారు. రిఫార్మ్, పర్ఫార్మ్ ఎండ్ ట్రాన్స్ ఫార్మ్ అని ప్రధాన మంత్రి బిగ్గరగా స్పష్టమైన పిలుపు ను ఇచ్చారు అని శ్రీ గుప్త అన్నారు.

ఈ మూడు ‘డి’ లు భారతదేశానికి దాని అభివృద్ధి ప్రస్థానం లో ఏ విధం గా సాయపడుతున్నదీ నేశనల్ ఎడ్యుకేశన్ టెక్నాలజీ ఫోరమ్ చైర్ మన్ ప్రొఫెసర్ శ్రీ అనిల్ సహస్రబుద్ధే కూడా వివరించారు.

రిఫార్మ్, పర్ఫార్మ్ ఎండ్ ట్రాన్స్ ఫార్మ్ అంటూ సాగిన ప్రధాన మంత్రి సందేశం గడచిన తొమ్మిది సంవత్సరాల లో మనకు ఎలాగ సాయపడిందీ, మరి రాబోయే 25 సంవత్సరాల లో విశ్వానికి మిత్ర గా భారతదేశం ఏ విధం గా మారగలదనేది ఐఐటిఇ గాంధి నగర్ వైస్ చాన్స్ లర్ శ్రీ హర్షద్ పటేల్ తన ప్రతిస్పందన లో వివరించారు.

సామూహిక ప్రయాస లు అవసరమంటూ ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు ను జామియా మిలియా ఇస్లామియా వైస్ చాన్స్ లర్ నజ్ మా అఖ్తర్ గారు కూడా బలపరచారు.

ప్రపంచ విజేత, అర్జున పురస్కార గ్రహీత, భారతదేశానికి చెందిన విలువిద్య నిపుణుడు శ్రీ అభిషేక్ వర్మ ప్రజల కు 77వ స్వాతంత్ర్య దినం సందర్భం లో అభినందనల ను వ్యక్తం చేశారు. అవినీతి కి వ్యతిరేకం గా ఉండాలి అనే ప్రధాన మంత్రి ధ్యేయం సాధన లో ఆయన కు సమర్థన ను అందించాలి అంటూ ప్రతి ఒక్కరి కి శ్రీ అభిషేక్ వర్మ విజ్ఞ‌ప్తి చేశారు.

అంతర్జాతీయ పతక విజేత శ్రీ గౌరవ్ రాణా ప్రధాన మంత్రి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రథమ్, ఆల్ వేస్ ప్రథమ్ తాలూకు సందేశాన్ని గురించి ప్రతిస్పందించారు.

క్రీడల రంగం లో అంతర్జాతీయ పతకాల ను సాధించినటువంటి నిహాల్ సింహ్ కూడా రాష్ట్ర ప్రథమ్ (దేశమే సర్వోపరి) అనే ఆలోచన ను గురించి విపులం గా మాట్లాడారు.

రాష్ట్ర ప్రథమ్ ను గురించి అంతర్జాతీయ పతక విజేత ఫెన్సింగ్ క్రీడాకారిణి జాస్మిన్ కౌర్ గారు కూడా మాట్లాడారు.

జాతీయ క్రీడా పురస్కార గ్రహీత కిరణ్ గారు చేసిన ట్వీట్ ఇదుగో..

ప్రధాన మంత్రి ఈ రోజు న ఎర్ర కోట నుండి ఇచ్చిన సందేశాన్నుండి ప్రేరణ ను పొందండి అంటూ అంతర్జాతీయ పతక విజేత ప్రియ సింహ్ గారు ప్రతి ఒక్కరి కి విజ్ఞ‌ప్తి చేశారు.

దేశ నిర్మాణం లో రైతుల కు మరియు వారి యొక్క తోడ్పాటు కు ప్రధాన మంత్రి ఇచ్చిన గుర్తింపు పట్ల పద్మ శ్రీ శ్రీ భరత్ భూషణ్ త్యాగి కృత‌జ్ఞ‌త‌ల ను వ్యక్తం చేశారు.

 

అదే విధం గా, ఇటీవలి కార్యక్రమాలు రైతుల కు ప్రగతి ని తెచ్చిపెట్టాయి అంటూ శ్రీ వేద్ వ్రత ఆర్య కూడాను మాట్లాడారు.

ప్రధాన మంత్రి ఎర్ర కోట నుండి చేసిన ప్రసంగం లో దేశం యొక్క నిర్మాణం లో మహిళల భూమిక అనే అంశం ఏ విధం గా మహిళల కు ఒక నూతనమైనటువంటి శక్తి ని సంతరించి పెట్టిందో ప్రముఖ నటి సరిత జోశి గారు ప్రస్తావించారు.

ప్రధాన మంత్రి దేశ ప్రజల ను ఉద్దేశించి తాను ఇచ్చిన ప్రసంగం ద్వారా రిఫార్మ్, పర్ఫార్మ్ ఎండ్ ట్రాన్స్ ఫార్మ్ అంటూ యువతీయువకుల కు ఎలాగ ఒక ఎంతో మంచిదైన దిశ ను అందించిందీ ప్రముఖ కథక్ నర్తకి నళిని అస్థాన గారు ప్రముఖం గా ప్రస్తావించారు.

మహిళల సశక్తీకరణ కు మంచి ప్రాముఖ్యాన్ని ఇస్తున్నందుకు గాను మహిళలు అందరి తరుఫున ప్రధాన మంత్రి కి ధన్యవాదాల ను పద్మ శ్రీ పురస్కార గ్రహీత మరియు మహిళల రోగ శాస్త్రం లో ప్రముఖ వైద్యురాలు అయినటువంటి డాక్టర్ అల్క కృపలాని గారు వ్యక్తం చేశారు.

మహిళల అభ్యున్నతి ని గురించి మరియు మహిళల కు వ్యతిరేకం గా జరుగుతున్న నేరాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించినందుకు గాను కలారి కేపిటల్ ఎమ్ డి వాణి కోల గారు ప్రధాన మంత్రి ని ప్రశంసించారు.

మహిళల సశక్తీకరణ పట్ల ప్రధాన మంత్రి కి ఉన్న తపన మరియు మహిళల కోసం చేపట్టే క్రొత్త కార్యక్రమాల విషయం లో క్రొత్త ప్రకటనల ను చేసినందుకు గాను పద్మ భూషణ్ పురస్కార గ్రహీత మరియు ప్రముఖ గాయని కె.ఎస్. చిత్ర గారు తన హర్షోల్లాసాల ను వ్యక్తం చేశారు.

ప్రపంచం లో మహిళా వాణిజ్య పైలట్ ల ను అత్యధిక సంఖ్య లో కలిగివున్న దేశం భారతదేశం అంటూ ప్రధాన మంత్రి ప్రస్తావన ను తీసుకు రావడం పట్ల పైలట్ కెప్టెన్ జోయా అగ్రవాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. (శాన్ ఫ్రాన్సిస్కో నుండి బెంగళూరు కు అత్యంత దూరం విమానాన్ని అందరూ మహిళలే పైలట్ లు గా నడిపిన సందర్భం లో వారికి కెప్టెన్ గా జోయా అగ్రవాల్ గారు వ్యవహరించారు.)

మన దేశం యొక్క అభివృద్ధి లో మహిళల భూమిక విషయం లో ప్రధాన మంత్రి కనబరచిన శ్రద్ధ ను గురించి మహారాష్ట్ర యూనివర్సిటి ఆఫ్ హెల్థ్ సైన్సెస్ వైస్ చాన్స్ లర్ లెఫ్టినంట్ జనరల్ (రిటైర్ డ్) మాధురి కనిత్కర్ గారు మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తపరచారు..

***



(Release ID: 1949039) Visitor Counter : 110