ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘‘అరుణాచల్ రంగ్మహోత్సవ్’’ అరుణాచల్ ప్రదేశ్ యొక్క సుసంపన్నమైన సాంస్కృతిక వైభవాన్ని ఒక ఉత్సవంవలే జరుపుకొనేదిగాను మరియు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ సిద్ధాంతాల కు తులతూగినట్లుగాను ఉంది: ప్రధాన మంత్రి

Posted On: 09 AUG 2023 5:06PM by PIB Hyderabad

అరుణాచల్ రంగ్ మహోత్సవ్ ను దిల్లీ, ముంబయి, కోల్ కాతా మరియు గువాహాటీ లు సహా భారతదేశం లోని వివిధ ప్రాంతాల లో జరుపుకొంటున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖాండూ యొక్క ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ -

‘‘అరుణాచల్ రంగ్ మహోత్సవ్ కేవలం ఒక కార్యక్రమం కంటే మిన్న అయినటువంటిది గా ఉంది; ఆ ఉత్సవాన్ని అరుణాచల్ ప్రదేశ్ యొక్క సుసంపన్నమైనటువంటి సాంస్కృతిక వైభవాన్ని ఒక సంబురం వలె జరుపుకోవడమే అని వర్ణించవచ్చును. అది ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ సూత్రాల తో తుల తూగుతున్నట్లు గా ఉన్నది. ఈ కార్యక్రమాన్ని దిల్లీ, ముంబయి, కోల్ కాతా మరియు గువాహాటీ లు సహా భారతదేశం లోని అనేక ప్రాంతాల లో జరుపుకొంటూ ఉండడాన్ని చూస్తే సంతోషం గా ఉంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

****

DS/TS


(Release ID: 1947371) Visitor Counter : 163