ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం సాధించిన కాంపౌండ్ మహిళా జట్టును అభినందించిన ప్రధాన మంత్రి

Posted On: 05 AUG 2023 9:30AM by PIB Hyderabad

బెర్లిన్ లో జరిగిన వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో భారత దేశానికి తొలి బంగారు పతకాన్ని సాధించిన భారత మహిళల కాంపౌండ్ జట్టును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

'బెర్లిన్ లో జరిగిన ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో మన అసాధారణ కాంపౌండ్ మహిళల జట్టు భారత్ కు తొలి స్వర్ణ పతకం తీసుకురావడం దేశానికి గర్వకారణం. మనఛాంపియన్ లకు అభినందనలు! వారి కృషి, అంకితభావం ఈ అద్భుతమైన ఫలితానికి దారితీశాయి' అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.

 

 

***

DS/ST



(Release ID: 1946151) Visitor Counter : 111