ప్రధాన మంత్రి కార్యాలయం

మహారాష్ట్ర లోనిశాహ్ పుర్ లో విషాదభరిత ఘటన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్నితెలిపిన ప్రధాన మంత్రి


పిఎమ్ఎన్ఆర్ఎఫ్నుండి పరిహారాన్ని ప్రకటించారు 

Posted On: 01 AUG 2023 8:26AM by PIB Hyderabad

మహారాష్ట్ర లోని శాహ్ పుర్ లో జరిగిన ఒక విషాదాంత ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ఈ ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల యొక్క దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని మరియు గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘మహారాష్ట్ర లోని శాహ్ పుర్ లో జరిగిన విషాదాంత ఘటన గురించి తెలిసి బాధ పడ్డాను. ఈ ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల యొక్క కుటుంబాల కు ఇదే నా ప్రగాఢ సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు కలిగిన నష్టాన్ని నేను సైతం పంచుకొంటూ, వారు కోలుకోవాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. ఎన్ డిఆర్ఎఫ్ మరియు స్థానిక పాలన యంత్రాంగం ఘటన స్థలి కి చేరుకొన్నాయి; మరి బాధితుల కు కావలసినటువంటి సహాయ సహకారాల ను అందించేందుకు చేతనైన అన్ని చర్యల ను చేపట్టడం జరుగుతున్నది.

 

ఈ ఘటన లో మృతుల యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. క్షతగాత్రుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి శ్రీ @narendramodi’’ అని పేర్కొంది.

 

 

***

DS/ST



(Release ID: 1944628) Visitor Counter : 89