హోం మంత్రిత్వ శాఖ

అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మరియు సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన సబర్మతి రివర్ ఫ్రంట్‌లో మేడ్ ఇన్ ఇండియా 'అక్షర్ రివర్ క్రూయిజ్'ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా


ప్ర‌పంచంలోని అన్ని రంగాల్లో భార‌త‌దేశాన్ని ప్ర‌ధ‌మ స్థానంలో నిలప‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గ‌త 9 సంవ‌త్స‌రాల‌లో చేసిన ప్ర‌య‌త్నాల ఫ‌లితాలు ఇప్పుడు క‌నిపిస్తున్నాయి.

గత 9 ఏళ్లలో గరీబ్ కళ్యాణ్, భారత్ గౌరవ్, భారత్ ఉత్కర్ష్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పథకాల ద్వారా మొత్తం భారతదేశ అభివృద్ధికి ప్రధాని మోదీ కొత్త రూపాన్ని ఇచ్చారు.

ప్రధాని మోదీ గుజరాత్‌ టూరిజంలో అనేక కార్యక్రమాలు చేపట్టి కొత్త కోణాన్ని అందించారు

శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, భారతదేశంలోని నదీ తీర విహారాన్ని తొలిసారిగా ఊహించి నిర్మించారు.

సబర్మతి రివర్ ఫ్రంట్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది

నదీతీర రక్షణ కారణంగా నీటి మట్టం పెరగడమే కాకుండా, వృద్ధులు, పిల్లలు మరియు యువతతో సహా ప్రతి ఒక్కరికీ వివిధ సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాల కేంద్రంగా కూడా ఇది ఉద్భవించింది.

భారతదేశంలో తయారు చేయబడిన 'అక్షర్ రివర్ క్రూయిజ్' ఈ రివర్ ఫ్రంట్‌తో అనుసంధానించబడి అహ్మదాబాద్ ప్రజలకు మరియు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.

Posted On: 02 JUL 2023 2:31PM by PIB Hyderabad

అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మరియు సబర్మతి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన సబర్మతి రివర్ ఫ్రంట్‌లో మేడ్ ఇన్ ఇండియా 'అక్షర్ రివర్ క్రూయిజ్'ని కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈరోజు ప్రారంభించారు.

 

శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో, ఈ అక్షర రివర్ క్రూయిజ్ ద్వారా, గుజరాత్ ప్రభుత్వం మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఈ రోజు అహ్మదాబాద్ నగర పౌరులకు కొత్త బహుమతిని అందించాయని అన్నారు. శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తాను మొదటిసారిగా భారతదేశంలో నదీ తీర విహారం (రివర్ ఫ్రంట్‌) ను ఊహించి, ప్లాన్ చేశారని, అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అభివృద్ధి చేయబడి పూర్తి చేయబడిందని ఆయన అన్నారు. రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్‌లోనే కాకుండా భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని మరియు పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఆవిర్భవించిందని శ్రీ షా చెప్పారు.

 

నదీతీర విహార నిర్మాణం వల్ల నీటిమట్టం పెరగడమే కాకుండా, వృద్ధులు, పిల్లలు, యువతతో సహా ప్రతి ఒక్కరికీ వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా ఆవిర్భవించిందని కేంద్ర హోం మరియు సహకార మంత్రి అన్నారు. ఈ లగ్జరీ రివర్ క్రూయిజ్ అహ్మదాబాద్ పౌరులందరికీ కొత్త ఆకర్షణగా నిలుస్తుందని ఆయన అన్నారు. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మరియు సబర్మతి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లచే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో ఈ క్రూయిజ్ అభివృద్ధి చేయబడిందని ఆయన తెలిపారు. ఈ క్రూయిజ్ భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా కింద ₹15 కోట్ల వ్యయంతో జంట ఇంజిన్‌లతో నిర్మించిన మొదటి ప్రయాణీకుల విహార నౌక మరియు ఇది ఒకటిన్నర గంటల పాటు సురక్షితంగా విహారం ప్రయాణించగలదు. ఈ 30 మీటర్ల క్రూయిజ్ అహ్మదాబాద్ మరియు దేశంలోని ఈ నగరాన్ని సందర్శించే పౌరులందరికీ ఆకర్షణీయంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ క్రూయిజ్‌లో 165 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉందని, ఇందులో రెస్టారెంట్ కూడా ఉందని, ఇది కచ్చితంగా ప్రజలను ఆకర్షిస్తుందని శ్రీ షా చెప్పారు.

 

పౌరుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్రూయిజ్‌ని రూపొందించామని, ఇందులో 180 ప్రాణ రక్షణ  జాకెట్లు, అగ్ని మాపక సురక్షణ, అత్యవసర రక్షణ బోట్‌లు ఉన్నాయని శ్రీ అమిత్ షా తెలిపారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీ నరేంద్ర మోదీ అహ్మదాబాద్, గుజరాత్ టూరిజానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. శ్రీ నరేంద్ర మోదీ పర్యాటక రంగంలో చేపట్టిన అనేక కార్యక్రమాల కారణంగా గుజరాత్ మరియు దాని రెండు ప్రధాన పర్యాటక కేంద్రాలు దేశ పర్యాటక పటంలో ప్రముఖంగా నిలిచాయని ఆయన అన్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడితో గుజరాత్‌కు వచ్చే లక్షలాది మంది పర్యాటకుల కోసం పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేశామని, అన్ని తీర్థయాత్రలు మరియు సరిహద్దులను కలుపుతూ మంచి రోడ్లు నిర్మించామని, పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడానికి విమానాశ్రయాలను పర్యాటక ప్రాంతాలకు అనుసంధానించే రహదారులను కూడా నిర్మించామని చెప్పారు.

 

అంబాజీ వద్ద దృశ్య శ్రవణ ప్రదర్శన ప్రారంభమైందని, 500 ఏళ్ల తర్వాత పావగడ ఆలయంలో జెండా ఎగురవేయడం జరిగిందని, మాధవపూర్ జాతర జాతీయ జాతరగా మారిందని, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకుల కోసం కచ్‌లో టెంట్ నగరాన్ని నిర్మించామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. దీనితో పాటు, కంకారియా చెరువు మరియు ఇప్పుడు, అహ్మదాబాద్‌లోని ఈ రివర్ ఫ్రంట్‌తో పాటు, భారీ పర్యాటక పర్యావరణ వ్యవస్థ సృష్టించబడింది. సర్హద్ దర్శన్ ప్రోగ్రామ్ (సరిహద్దు సందర్శన కార్యక్రమం) కింద, క్లిష్ట పరిస్థితుల్లో భద్రతా దళాలు తమ విధులను నిర్వర్తించే నాడబెట్ అనుభవాన్ని గుజరాత్ యువతకు అందించడానికి కూడా ఏర్పాట్లు చేశామని శ్రీ షా చెప్పారు.

శ్రీ నరేంద్ర మోదీ టూరిజం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారని, దీని కారణంగా గుజరాత్‌కు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకుల తాకిడి చాలా రెట్లు పెరిగిందని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లో ఉందని, ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లు క్రమం తప్పకుండా జరుగుతాయని, పర్యాటకం కూడా పెరిగిందని శ్రీ షా తెలిపారు. ఇది కాకుండా, ఇప్పుడు చాలా పెద్ద స్పోర్ట్స్ సిటీ కూడా ఇక్కడ రూపుదిద్దుకుంటోంది. ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టి గుజరాత్‌ పర్యాటక రంగానికి కొత్త కోణాన్ని అందించారన్నారు.

 

ప్రపంచంలోని అన్ని రంగాలలో భారతదేశాన్ని మొదటి స్థానంలో నిలపడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత 9 సంవత్సరాలలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయని శ్రీ అమిత్ షా అన్నారు. గత 9 ఏళ్లలో గరీబ్ కళ్యాణ్, భారత్ గౌరవ్, భారత్ ఉత్కర్ష్, మౌలిక సదుపాయాల కల్పన వంటి పథకాల ద్వారా యావత్ భారతదేశ అభివృద్ధికి ప్రధాని మోదీ కొత్త రూపు ఇచ్చారని అన్నారు.

 

*****



(Release ID: 1936951) Visitor Counter : 146