ఆయుష్
9 వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఎంపీ జబల్పూర్లోని గారిసన్ గ్రౌండ్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి నేతృత్వంలో యోగా చేయనున్న 15000 మందికి పైగా ఔత్సాహికులు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఈ ఏడాది 'ఓషన్ రింగ్ ఆఫ్ యోగ' గా అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా, యోగా భారతమాల, యోగా సాగర్మాల, ప్రతి ఇంట్లో యోగ చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ
Posted On:
20 JUN 2023 2:38PM by PIB Hyderabad
9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 జాతీయ వేడుకలు జూన్ 21న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంఖర్ నేతృత్వంలో జరుగుతాయి. కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ ఛగన్భాయ్ పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర ఆయుష్, ఓడరేవులు,నౌక రవాణా, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్పరా మహేంద్రభాయ్ పలువురు రాష్ట్ర ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేస్తారు.
ప్రధాన కార్యక్రమంలో దాదాపు 15,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 'వసుధైక కుటుంబానికి యోగా' ఇతివృత్తంతో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
'వసుధైక కుటుంబానికి యోగా' భారతీయ సామాజిక-సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకున్న చొరవతో యోగా గత 9 సంవత్సరాల కాలంలో ప్రపంచంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి చేరింది.ఈ ఏడాది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అమెరికా న్యూయార్క్ లో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరగనున్నది. కార్యక్రమంలో 180 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటాయి. రెండు దేశాల పర్యటనకు బయలుదేరి ముందు విడుదల చేసిన ప్రకటనలో "నేను జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 ని జరుపుకుంటాను, నాతో పాటు ఐక్యరాజ్య సమితి నాయకత్వం వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ప్రత్యేక వేడుక కోసం నేను ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని 2014 డిసెంబర్ లో భారతదేశం చేసిన ప్రతిపాదన ఆమోదం పొందిన ప్రదేశంలో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగడం విశేషం."అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 నిర్వహణ కోసం సన్నాహక కార్యక్రమాలు 2023 మార్చి 13న ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ఆయుష్ శాఖ మంత్రి
IDY 2023 తయారీ 13వ మ్యాచ్ 2023న ప్రారంభమైంది, గౌరవనీయులైన ఆయుష్ మంత్రి 100 రోజుల కౌంట్డౌన్ను ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి రోజు వివిధ ప్రభుత్వ సంస్థలతో సహా అన్ని సంబంధిత వర్గాలు ప్రజల సహకారంతో కార్యక్రమాలు నిర్వహించి ప్రజా ఉద్యమంగా నిర్వహించాయి. 21 జూన్ 2023న కార్యక్రమాలు ముగుస్తాయి.
ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఓషన్ రింగ్ ఆఫ్ యోగా వంటి ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటుంది. చూస్తుంది, ఇక్కడ భారతీయ నావికాదళం, మర్చంట్ షిప్లు వివిధ మహాసముద్రాలలో స్నేహపూర్వక దేశాలకు చెందిన రేవుల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా వరకు జరిగే యోగా మరో విశేషంగా ఉంటుంది. కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖతో కలిసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. భూమధ్య రేఖకు ఉన్న దేశాలతో సహా ఐక్యరాజ్యసమితి లో సభ్యత్వం కలిగిన దేశాలు కార్యక్రమంలో పాల్గొంటాయి. ఉత్తర ధ్రువం, దక్షిణ ధృవ ప్రాంతాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ బాధ్యతలు భూ శాస్త్ర మంత్రి శాఖ తీసుకుంది. ఆర్కిటిక్లోని భారతీయ పరిశోధనా స్థావరం హిమాద్రి, అంటార్కిటికాలోని భారత పరిశోధనా స్థావరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తారు.
యోగా భారతమాల కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో ఐటీబీటీ,బిఎస్ఎఫ్ బిఆర్ఓ లతో పాటు భారత సాయుధ దళాలు సామూహిక యోగా ప్రదర్శనను నిర్వహిస్తాయి. యోగా సాగరమాల కార్యక్రమంలో భాగంగా భారత తీర రేఖ వెంబడి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుంది. రక్షణ మంత్రి నేతృత్వంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ఫ్లైట్ డెక్ వద్ద యోగా ప్రదర్శన ఉంటుంది.
గ్రామ స్థాయిలో యోగాకు ప్రాచుర్యం కల్పించి ప్రతి ఒక్కరూ యోగ చేసేలా చూసి యోగ "హర్ ఆంగన్ యోగా"గుర్తింపు పొందేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తమ గ్రామస్తులతో కలిసి జరుపుకోవాలని గ్రామ సర్పంచ్లకు రాసిన లేఖలో ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా తమ సమీప అంగన్వాడీలు, ఆరోగ్య, ఆరోగ్య కేంద్రాలు , పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించ వచ్చు. జాతీయ ఆయుష్ మిషన్, ఆయుష్ గ్రామ్ కింద సుమారు 2 లక్షల సేవా కేంద్రాలు, ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటాయి. దాదాపు 50,000 మంది అమృత్ సరోవర్ లో యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ "యోగా మై ప్రైడ్" అనే ఫోటోగ్రఫీ పోటీ నిర్వహిస్తోంది.పోటీలో పాల్గొడానికి ఆసక్తి కలిగినవారు “యోగాసనాలు” చేస్తున్న ఫోటోను తగిన శీర్షికతో పాటు అప్లోడ్ చేయవచ్చు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనేవారికి మూడు విభాగాలలో బహుమతులు అందిస్తారు.
పని చేస్తున్న ప్రాంతాలలో కూడా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. Y-బ్రేక్ @ వర్క్స్పేసెస్ -యోగ ఇన్ చైర్ పేరిట నిర్వహించే కార్యక్రమంలో కుర్చీలో కూర్చుని యోగాసనాలు వేయవచ్చు. ఒత్తిడిని తగ్గించడం,సేద తీరడం, పనిపై దృష్టి సారించడానికి దోహదపడుతుంది.కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాలు తమ ఉద్యోగులను కుర్చీలో కూర్చోబెట్టి యోగా చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మొత్తం ప్రభుత్వ విధానాలతో నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కీలక మంత్రిత్వ శాఖలు, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ యోగా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, సాయుధ దళాలు, ఎన్ఎస్ఎస్, ఎన్ వై కె వాలంటీర్లు, సంబంధిత వర్గాలు ఇప్పటికే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 నిర్వహణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించాయి. . భారతీయ మిషన్లు , రాయబార కార్యాలయాలు, ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు కూడా 21 జూన్ 2023 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేశాయి.
***
(Release ID: 1933689)