ప్రధాన మంత్రి కార్యాలయం

జమ్ము- కశ్మీర్లోని బారామూలా లో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి

Posted On: 01 JUN 2023 10:27AM by PIB Hyderabad

జమ్ము- కశ్మీర్ లోని బారామూలా జిల్లా లో రైతుల కోసం 7 కస్టమ్ హైరింగ్ సెంటర్ స్, స్వయం సహాయ సమూహాల కోసం 9 పాలీ గ్రీన్ హౌసె స్ సహా కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన పథకాలు ప్రారంభం కావడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

జమ్ము- కశ్మీర్ లెఫ్టెనంట్ గవర్నర్ కార్యాలయం చేసిన పలు ట్వీట్ లను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,

‘‘తాజా గా ప్రారంభించిన అభివృద్ధి కార్యాల తాలూకు ప్రశంసనీయమైనటువంటి శ్రేణి.. జమ్ము- కశ్మీర్ ప్రజల, ప్రత్యేకించి ఆకాంక్షయుక్త జిల్లాల లో నివసిస్తున్న వారి జీవన నాణ్యత ను వృద్ధి చెందింప చేసే దిశ లో మా వచనబద్ధత కు ప్రమాణాన్ని చాటుతున్నది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*******

DS/ST



(Release ID: 1928951) Visitor Counter : 152