ప్రధాన మంత్రి కార్యాలయం

హిరోషిమా శాంతి స్మారక సంగ్రహాలయం సందర్శించిన ప్రధానమంత్రి

Posted On: 21 MAY 2023 7:58AM by PIB Hyderabad

హిరోషిమాలో జి7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన దేశాధినేతలతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ శాంతి స్మారక సంగ్రహాలయం సందర్శించారు.  మ్యూజియంలో ఉంచిన సందర్శకుల పుస్తకంలో ప్రధానమంత్రి సంతకం చేశారు.   అణుబాంబు దాడిలో మరణించిన వారి స్మారక స్థూపం వద్ద  నాయకులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.  



(Release ID: 1926125) Visitor Counter : 154