ప్రధాన మంత్రి కార్యాలయం
గత ఐదు సంవత్సరాలుగా క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంలో ఖేలో ఇండియా పోషించిన పాత్రను అభినందించిన – ప్రధానమంత్రి
Posted On:
22 APR 2023 7:49PM by PIB Hyderabad
గత ఐదు సంవత్సరాలుగా క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంలో ఖేలో ఇండియా పోషించిన పాత్రను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ చేసిన ట్వీట్ కు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ,
“ఖేలో ఇండియా కు ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, క్రీడాకారులు మంచి పేరు తెచ్చుకునేందుకు గొప్ప అవకాశాలను కల్పించడంలో ఖేలో ఇండియా చూపిన చొరవ, పోషించిన పాత్రను మేము గుర్తించి, అభినందిస్తున్నాము. మన ప్రభుత్వం భారతదేశంలో క్రీడలు అభివృద్ధి చెందడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడం కొనసాగిస్తుంది." అని పేర్కొన్నారు.
(Release ID: 1919010)
Visitor Counter : 194
Read this release in:
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil