ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అన్ని ప్రగతి పరామితులను సాధించిన తెహ్రీ ప్రజల కృషికి ప్రధానమంత్రి అభినందన

प्रविष्टि तिथि: 22 APR 2023 9:14AM by PIB Hyderabad

   ప్రగతి పరామితుల రీత్యా ఉత్తరాఖండ్‌ను దేశంలోనే అగ్రస్థానాన నిలపడంలో తెహ్రీ ప్రజల కృషి, అంకితభావాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

దీనిపై ఎంపీ శ్రీమతి మాలా రాజ్యలక్ష్మి షా ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:

“ఈ విజయం సాధించడం ఎంతో గర్వకారణం. దీనిపై తెహ్రీలోని నా సోదర సోదరీమణులందరికీ నా అశేష అభినందనలు. అభివృద్ధి దిశగా మీ కృషికి, అంకితభావానికి ఈ విజయం నిదర్శనం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1918778) आगंतुक पटल : 200
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada