ప్రధాన మంత్రి కార్యాలయం

భర్తీ పరీక్షల ను ప్రాంతీయ భాషల లోనిర్వహించడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 19 APR 2023 2:57PM by PIB Hyderabad

స్టాఫ్ సెలక్షన్ కమిశన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎస్ఎస్ సి ఎమ్ టిఎస్) పరీక్ష ను మరియు సిహెచ్ఎస్ఎల్ఇ పరీక్ష ను హిందీ మరియు ఇంగ్లీషు భాషల కు తోడు 13 ప్రాంతీయ భాషల లో నిర్వహించాలన్న చొరవ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది భాష పరమైనటువంటి అడ్డంకి తాలూకు నష్టాన్ని ఎదుర్కోకుండానే మన యువతీ యువకుల కు సమానమైన అవకాశాల ను ప్రసాదిస్తుంది అని ఆయన అన్నారు.

‘‘ప్రాంతీయ భాష ల పట్ల మేం కట్టబెడుతున్న ప్రాధాన్యం మరియు మన యువత కు వారి కలల ను పండించుకోవడాని కి ఒక విశాలమైనటువంటి కేన్ వాస్ ను అందించడం పూర్తి ఉత్సాహం తో కొనసాగుతోంది.’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 



(Release ID: 1918098) Visitor Counter : 150