ప్రధాన మంత్రి కార్యాలయం

భారత ప్రజలు వాణిజ్యంలో విశేష ప్రతిభ.. సామర్థ్యాలను చాటుతున్నారు: ప్రధానమంత్రి

Posted On: 14 APR 2023 9:27AM by PIB Hyderabad

   భారతీయులు వాణిజ్యంలో తమ ప్రతిభను, సామర్థ్యాన్ని విశేషంగా చాటుకుంటున్నారని ప్రధాని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మన దేశం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 770 బిలియన్‌ డాలర్ల ఎగుమతులతో కొత్త రికార్డు సృష్టించిందని పేర్కొంటూ కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“భారతీయులు వాణిజ్యంలో తమదైన ప్రతిభను, సామర్థ్యాన్ని విశేషంగా ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఎంతో విశ్వాసంతో, ఉత్సాహంతో భారత్‌వైపు చూస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1916220

 

 

***

DS/ST



(Release ID: 1916599) Visitor Counter : 149