ప్రధాన మంత్రి కార్యాలయం
మన మత్స్యకారుల జీవితాల్లో సానుకూల మార్పు దిశగా మా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
06 APR 2023 10:00AM by PIB Hyderabad
మత్స్యకారుల జీవితాల్లో సానుకూల మార్పు దిశగా తమ ప్రభుత్వం ఎంతో శ్రమిస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇందులో భాగంగా రుణం సౌలభ్యానికి హామీ ఇవ్వడంతోపాటు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చిందన్నారు. అంతేకాకుండా మౌలిక సదుపాయాల ఉన్నతీకరణసహా మరెన్నో చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు.
ఈ మేరకు మత్స్య-పశుసంవర్ధక-పాడిపరిశ్రమ శాఖ మంత్రి ట్వీట్పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఇదో ఉత్తమ పని విధానం.. మన మత్స్యకారుల జీవితాల్లో సానుకూల మార్పు దిశగా మా ప్రభుత్వం ఎనలేని కృషిచేస్తోంది. ఇందులో భాగంగా రుణ సౌలభ్యానికి భరోసా ఇచ్చింది. అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తేవడంతోపాటు మౌలిక సదుపాయాల మెరుగుదలసహా మరెన్నో చర్యలు చేపట్టింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*****
DS/SH
(रिलीज़ आईडी: 1914492)
आगंतुक पटल : 200
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam