ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎరువుల విషయం లో ఆత్మనిర్భరత దిశ లో మరొక గొప్ప కార్యసిద్ధి


నానో యూరియా తరువాత, నానో డిఎపి కి ఆమోదంలభించింది

రైతు ల జీవనాన్ని మరింత సులభం చేసే దిశ లో ఇది ఒక కీలకమైనఅడుగు అని అభివర్ణించిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 05 MAR 2023 9:44AM by PIB Hyderabad

భారత ప్రభుత్వం నానో యూరియా తరువాత, ఇప్పుడు నానో డి.ఎ.పి కి కూడా అనుమని ని ఇచ్చింది. ఈ నిర్ణయం మన రైతు సోదరుల మరియు రైతు సోదరీమణుల జీవనాన్ని సులభతరం చేసేటటువంటి దిశ లో ఒక కీలకమైన అడుగు అని ప్రధాన మంత్రి అభివర్ణించారు.

 

రసాయనాలు మరియు ఎరువుల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియా ట్వీట్ కు ప్రధాన మంత్రి జవాబిస్తూ -

‘‘మన రైతు సోదరుల మరియు రైతు సోదరీమణుల యొక్క జవనాన్ని మరింత గా సులభం చేసివేసే దిశ లో ఇది ఒక కీలకమైనటువంటి అడుగు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*******

DS/ST


(రిలీజ్ ఐడి: 1904373) సందర్శకుల సూచీ సంఖ్య : : 276