ప్రధాన మంత్రి కార్యాలయం

‘సుపోషిత్ మా’ కార్యక్రమాన్ని లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా చేపట్టడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి 

Posted On: 21 FEB 2023 11:26AM by PIB Hyderabad

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా చేపట్టిన ‘సుపోషిత్ మా’ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ రేంద్ర మోదీ ప్రశంసించారు. ‘సుపోషిత్ మా అభియాన్’ ను కోటా లోని రామ్ గంజ్ మండీ ప్రాంతం లో శ్రీ ఓం బిర్ లా ప్రారంభించారు. ప్రతి ఒక్క మాతృమూర్తి ని మరియు శిశువు ను ఆరోగ్యవంతం గా ఉంచాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ధ్యేయం గా ఉంది.

 

లోక్ సభ స్పీకర్ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

‘‘గౌరవనీయులైన లోక్ సభ స్పీకర్ చొరవ తో ఒక ప్రేరణాత్మక కార్యక్రమం ఆరంభం అయింది. ఆరోగ్యవంతమైన మాత మరియు స్వస్థ శిశువు లతో పాటు ఈ కార్యక్రమం లో పూర్తి కుటుంబం యొక్క సమృద్ధి ఇమిడి ఉంది. మరి ఇదే ఒక సశక్తమైన సమాజాని కి మూలస్తంభం గా కూడాను ఉంది.’’ అంటూ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*****

DS/ST



(Release ID: 1901086) Visitor Counter : 215