ప్రధాన మంత్రి కార్యాలయం

వర్చువల్ మాధ్యం ద్వారా భారతదేశాని కి మరియు సింగపూర్ కు మధ్య యుపిఐ-పేనౌలింకేజీని ప్రారంభించే కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీమరియు సింగపూర్ ప్రధాని శ్రీ లీ సియెన్ లూంగ్


యుపిఐ-పేనౌ లింకేజి అనేది దేశాంతర లావాదేవీల ను సులభతరం గా, తక్కువ ఖర్చు తో కూడుకున్నవి గా మరియువాస్తవ కాల ప్రాతిపదిక కలిగినవి గా మార్చివేయనుంది

భారతదేశాని కి మరియు సింగపూర్ కు మధ్య ఒకటో క్రాస్-బార్డర్ లావాదేవీ నినిర్వహించిన ఆర్ బిఐ గవర్నరు మరియు ఎమ్ఎఎస్ యొక్క ఎమ్ డి  

Posted On: 21 FEB 2023 12:48PM by PIB Hyderabad

భారతదేశాని కి చెందిన యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యుపిఐ) కి మరియు సింగపూర్ కు చెందిన పేనౌ కు మధ్య రియల్ టైమ్ పేమెంట్ లింకేజి ని వర్చువల్ మాధ్యం ద్వారా ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు సింగపూర్ ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్ లు పాల్గొన్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నరు శ్రీ శక్తికాంత్ దాస్ తో పాటు మానిటరి ఆథారిటి ఆఫ్ సింగపూర్ యొక్క మేనేజింగ్ డైరెక్టరు శ్రీ రవి మేనన్ వారి వారి మొబైల్ ఫోన్ లను ఉపయోగిస్తూ ఒకరితో మరొకరు లైవ్ క్రాస్ బార్డర్ లావాదేవీ ని పూర్తి చేశారు.

 

క్లాస్ బార్డర్ పర్ సన్ టు పర్ సన్ (పి2పి) చెల్లింపు సదుపాయాన్ని ప్రవేశ పెట్టిన ఒకటో దేశం గా సింగపూర్ నిలచింది. ఈ సదుపాయం సింగపూర్ లో ఉంటున్న భారతీయ సముదాయానికి, ప్రత్యేకించి ప్రవాసి శ్రమికుల కు/విద్యార్థుల కు సహాయకారి కాగలదు. అంతేకాకుండా, భారతదేశం నుండి సింగపూర్ కు మరియు సింగపూర్ నుండి భారతదేశానికి వెనువెంటనే తక్కువ ఖర్చు తో డబ్బు ను బదలాయించే మాధ్యం ద్వారా డిజిటలీకరణ, ఇంకా ఫిన్ టెక్ ల ప్రయోజనాల ను సామాన్య మానవుల చెంత కు చేర్చుతుంది. క్యుఆర్ కోడ్ యొక్క మాధ్యం ద్వారా యుపిఐ చెల్లింపుల ను స్వీకరించడం అనేది సింగపూర్ లో ఎంపిక చేసిన కొన్ని మర్చంట్ అవుట్ లెట్ ల లో ఇప్పటికే అందుబాటు లో ఉంది.

 

వర్చువల్ మాధ్యం ద్వారా ఈ తరహా ప్రారంభ కార్యక్రమం నిర్వహణ కు పూర్వమే ఇరువురు ప్రధాన మంత్రుల మధ్య టెలిఫోన్ ద్వారా సంభాషణ చోటుచేసుకొంది; ఆ సంభాషణ లో భాగం గా పరస్పర హితం ముడిపడ్డ రంగాల ను గురించినటువంటి చర్చలు జరిగాయి. భారతదేశం-సింగపూర్ సంబంధాన్ని ముందుకు తీసుకు పోవడం లో ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్ యొక్క భాగస్వామ్యాని కి గాను ప్రధాన మంత్రి ధన్యవాదాల ను తెలియ జేశారు. జి20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తున్న ప్రస్తుత కాలం లో శ్రీ లీ సీన్ లూంగ్ తో కలసి పనిచేయాలని ఆశపడుతున్నానని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

***



(Release ID: 1901056) Visitor Counter : 190