ప్రధాన మంత్రి కార్యాలయం

అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసీకి ప్రధానమంత్రి హార్థిక స్వాగతం

Posted On: 24 JAN 2023 8:26PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆరబ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసీకి హార్థిక స్వాగతం పలికారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానంపై అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసీ  2023 జనవరి 24 నుంచి 26వ తేదీ వరకు భారతదేశంలో అధికారిక పర్యటనలో ఉన్నారు. భారతదేశంలో రెండో సారి అధికారిక పర్యటనకు వచ్చిన అధ్యక్షుడు సిసీ 74వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా కూడా హాజరవుతారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఇలా ట్వీట్‌ చేశారు.
‘‘అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసీ ...భారతదేశానికి మీకు హార్థిక స్వాగతం. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు మీరు భారతదేశంలో అధికారిక పర్యటనకు రావడం భారతీయులందరికీ ఆనందదాయకం. రేపు మీతో చర్చలకు ఎదురు చూస్తున్నాను@AlsisiOfficial’’

***

DS/AK



(Release ID: 1893523) Visitor Counter : 143