ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మైక్రోసాఫ్ట్   కార్పొరేశన్  చైర్మన్  మరియు సిఇఒ శ్రీ సత్య నాదెళ్ళ తో సమావేశమైన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 05 JAN 2023 3:08PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మైక్రోసాఫ్ట్ కార్పొరేశన్ చైర్ మన్ మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) శ్రీ సత్య నాదెళ్ళ తో సమావేశమయ్యారు. సాంకేతిక విజ్ఞానం లోను, నూతన ఆవిష్కరణల రంగం లోను భారతదేశం వేస్తున్నటువంటి ముందడుగు లు సాంకేతిక విజ్ఞానం నాయకత్వం లో వృద్ధి తాలూకు యుగాన్ని ప్రవేశపెడుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ @satyanadella , మీతో భేటీ అయినందుకు సంతోషం గా ఉంది. సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణల రంగం లో భారతదేశం వేస్తున్నటువంటి ముందంజ లు సాంకేతిక విజ్ఞానం నేతృత్వం లోని వృద్ధి యుగం లోకి నడిపిస్తున్నాయి. మా దేశ యువతరం అనేకమైన ఆలోచనల తో తొణికిసలాడుతున్నది; ఆ ఆలోచనల కు భూగ్రహాన్ని పరివర్తన చెందించే శక్తి ఉంది.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST


(రిలీజ్ ఐడి: 1888877) సందర్శకుల సూచీ సంఖ్య : : 221