ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం యొక్క తొలి  ప్రైవేట్  రాకెట్  ‘విక్రమ్-ఎస్’  ను విజయవంతం గా ప్రయోగించినందుకుఇస్రో కు మరియు ఇన్-స్పేస్ కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 18 NOV 2022 5:26PM by PIB Hyderabad

భారతదేశాని కి చెందిన తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-సబ్ఆర్బిటల్ ప్రయోగించడం లో సఫలం అయినందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్ఒ ) ను మరియు ఇన్-స్పేస్ (IN-SPACe) ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ రాకెట్ ను స్కై రూట్ ఏరో స్పేస్ అభివృద్ధిపరచింది.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

‘‘స్కై రూట్ ఏరో స్పేస్ రూపొందించిన రాకెట్ ‘విక్రమ్-ఎస్’ ఈ రోజు న శ్రీహరి కోట నుండి నింగికి ఎగయడం భారతదేశాని కి ఒక చరిత్రాత్మక క్షణం అని చెప్పాలి. ఇది భారతదేశం ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమ యొక్క ప్రయాణం లో ఒక ముఖ్యమైనటువంటి మైలు రాయి గా ఉన్నది. ఈ అసాధారణ కార్యాన్ని సాధ్యం చేసినందుకు @isro కు మరియు @INSPACeIND కు ఇవే అభినందన లు.’’

‘‘ఈ కార్యసిద్ధి మన యువత లో ఉన్న అపార ప్రతిభ కు ఒక నిదర్శన గా ఉంది. 2020వ సంవత్సరం జూన్ లో తెర మీదకు వచ్చిన అంతరిక్ష రంగ సంబంధి సంస్కరణల తాలూకు పూర్తి ప్రయోజనాన్ని మన యువతీయువకులు స్వీకరించారు.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1877157) Visitor Counter : 191