ప్రధాన మంత్రి కార్యాలయం

మిజోరమ్ లో రాళ్ళ గని లో జరిగిన ఒక ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లినందుకుసంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని కూడా ఆయన ప్రకటించారు

Posted On: 16 NOV 2022 9:28AM by PIB Hyderabad

మిజోరమ్ లో రాళ్ళ గని లో జరిగిన ఒక ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని అందించడం జరుగుతుందని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘మిజోరమ్ లో రాళ్ళ గని లో చోటు చేసుకొన్న ఒక విషాదకరమైనటువంటి ఘటన లో తమ ప్రియతముల ను కోల్పోయిన వ్యక్తుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. మృతుల దగ్గరి బంధువుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రమాదం లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల చొప్పున మంజూరు చేయడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.

 



(Release ID: 1876447) Visitor Counter : 116