ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరాఖండ్లోని పౌరీలో బస్సు దుర్ఘటనవల్ల ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 05 OCT 2022 9:07AM by PIB Hyderabad

   త్తరాఖండ్‌ రాష్ట్రంలోని పౌరీవద్ద బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కూడా ప్రధాని ఆకాంక్షించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

   “ఉత్తరాఖండ్‌లోని పౌరీవద్ద సంభవించిన హృదయవిదారక బస్సు ప్రమాదం నన్నెంతో బాధించింది. ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడివారు త్వరగా కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతం అక్కడ రక్షణ-సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో బాధితులకు అన్నివిధాలా సాయం అందించబడుతుంది: ప్రధాని మోదీ” అని పేర్కొంది.

***
DS/ST


(Release ID: 1865432) Visitor Counter : 113