ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ లోని వడోదర లో జరిగినరోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
పిఎమ్ఎన్ఆర్ఎఫ్నుండి పరిహారాన్ని ప్రకటించారు
Posted On:
04 OCT 2022 4:49PM by PIB Hyderabad
గుజరాత్ లోని వడోదర లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మానసిక క్షోభ నున వ్యక్తం చేసి, సంతాపాన్ని తెలియజేశారు. మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘వడోదర జిల్లా లో రోడ్డు ప్రమాదం జరిగిన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు వ్యథ కు లోనయ్యాను. ప్రియతములను కోల్పోయిన కుటుంబాలకు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలోనే పున:స్వస్థులు అగుదురు గాక. మృతుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది. గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.
*****
DS/TS
(Release ID: 1865121)
Visitor Counter : 131
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam