ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్ లోని వడోదర లో జరిగినరోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


పిఎమ్ఎన్ఆర్ఎఫ్నుండి పరిహారాన్ని ప్రకటించారు

Posted On: 04 OCT 2022 4:49PM by PIB Hyderabad

గుజరాత్ లోని వడోదర లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మానసిక క్షోభ నున వ్యక్తం చేసి, సంతాపాన్ని తెలియజేశారు. మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘వడోదర జిల్లా లో రోడ్డు ప్రమాదం జరిగిన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు వ్యథ కు లోనయ్యాను. ప్రియతములను కోల్పోయిన కుటుంబాలకు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలోనే పున:స్వస్థులు అగుదురు గాక. మృతుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది. గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.

 

*****

DS/TS

 



(Release ID: 1865121) Visitor Counter : 114