ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీమద్ పంచఖండ పీఠాధిపతి ఆచార్య ధర్మేంద్ర మృతికి ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 19 SEP 2022 7:59PM by PIB Hyderabad

   శ్రీమద్‌ పంచఖండ పీఠాధిపతి ఆచార్య ధర్మేంద్ర కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“సమాజం కోసమే కాకుండా దేశసేవకూ అంకితమైన శ్రీమద్ పంచఖండ పీఠాధిపతి శ్రీ ఆచార్య ధర్మేంద్ర మృతి అత్యంత బాధాకరం. ఆయన కన్నుమూత ధార్మిక, ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు. భగవంతుడు ఆయనకు తన పాదాల చెంత స్థానం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి!” అని ప్రధాని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 1860747) సందర్శకుల సూచీ సంఖ్య : : 147