ప్రధాన మంత్రి కార్యాలయం

జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ బస్సు ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం

Posted On: 17 SEP 2022 8:15PM by PIB Hyderabad

   జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.

ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో సంభవించిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపై నేనెంతో చింతిస్తున్నాను. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను.. అని పేర్కొన్నారు.. PM @narendramodi.”

 



(Release ID: 1860330) Visitor Counter : 116