మంత్రిమండలి

జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం నుంచి కక్కనాడ్ మీదుగా ఇన్ఫోపార్క్ వరకు కొచ్చి మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్టు కు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం 11.17 కి.మీ పొడవు, 11 స్టేషన్ల తో రూ.1,957.05 కోట్ల వ్యయంతో రెండవ దశ

Posted On: 07 SEP 2022 4:00PM by PIB Hyderabad

జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం నుండి కక్కనాడ్ మీదుగా ఇన్ఫోపార్క్ వరకు రూ. 1,957.05 కోట్లతో కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టు రెండవ దశ అమలుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం, కొచ్చి మెట్రో రైల్ ప్రాజెక్టు  కొచ్చి మెట్రో రైల్ రెండవ దశ ను జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం నుండి ఇన్ఫోపార్క్ వరకు కక్కనాడ్ మీదుగా 11.17 కి.మీ.లు పొడవుతో 11 స్టేషన్ లతో రూ.1,957.05 కోట్ల వ్యయంతో అమలుకు ఆమోదం తెలిపింది. సీపోర్ట్ ఎయిర్‌పోర్ట్ రోడ్డు రోడ్డు విస్తరణతో సహా ఫేజ్ -2 కోసం సన్నాహాలు బాగా జరుగుతున్నాయి.

కొచ్చిలో అలువా నుంచి పేట వరకు 25.6 కి.మీ.ల పొడవున 22 స్టేషన్లు, రూ.5181.79 కోట్ల పూర్తి వ్యయంతో మొదటి దశ పూర్తిగా పనిచేస్తోంది.

పేట నుంచి ఎస్ ఎన్ జంక్షన్ వరకు 1.80 కిలోమీటర్ల వయాడక్ట్ తో కొచ్చి మెట్రో ఫేజ్ 1ఎ ప్రాజెక్టు రూ.710.93 కోట్లతో ఆమోదించబడింది.  ఈ ప్రాజెక్టును రాష్ట్ర రంగ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని నిర్మాణ కార్యకలాపాలు పూర్తయ్యాయి. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.

ఎస్ ఎన్ జంక్షన్ నుంచి త్రిపుణితురా టెర్మినల్ వరకు 1.20 కిలోమీటర్ల దూరంతో కొచ్చి మెట్రో ఫేజ్ 1 బి ప్రాజెక్టు రాష్ట్ర సెక్టార్ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉంది.

 

 

 నిధుల నమూనా:

 

క్రమసంఖ్య

మూలం

మొత్తం (కోట్లలో)

% సహకారం

1.

కేంద్ర ప్రభుత్వ వాటా

274.90

16.23%

2.

కేరళ ప్రభుత్వ వాటా

274.90

16.23%

3.

కేంద్ర పన్నులో 50 శాతం భారత ప్రభుత్వ అనుబంధ రుణం

63.85

3.77%

4.

కేంద్ర పన్నులో 50 శాతం కేరళ ప్రభుత్వ అనుబంధ రుణం

63.85

3.77%

5.

ద్వైపాక్షిక/బహుపాక్షిక ఏజెన్సీల నుండి రుణాలు

1016.24

60.00%

6.

భూమి, R&R మరియు PPP భాగాలు మినహా మొత్తం ఖర్చు

1693.74

100.00%

7.

R&R వ్యయంతో సహా భూమిపై కేరళ ప్రభుత్వ రుణభారం

82.68

 

8.

రాష్ట్ర పన్నులను కేరళ ప్రభుత్వం భరించాలి

94.19

 

9.

నిర్మాణ సమయంలో వడ్డీ (IDC) రుణాలు మరియు ఫ్రంట్ ఎండ్ రుసుములను కేరళ ప్రభుత్వం భరించాలి

39.56

 

10.

పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ ఫ్యాక్టర్స్ (PFP)

46.88

 

11.

మొత్తం పూర్తి ఖర్చు

1957.05

 

 

నేపథ్యం :

కేరళలో అతిపెద్ద నగరమైన కొచ్చి రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత కలిగిన నగరం కూడా. ఇది విశాలమైన మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగం, ఇది కేరళలోని అతిపెద్ద పట్టణ సముదాయం. కొచ్చి మెట్రోపాలిటన్ ఏరియాలో 2013 లో దాదాపు 20.8 లక్షలు , 2021 లో 25.8 లక్షలు మరియు 2031 నాటికి 33.12 లక్షల జనాభా ఉంటుందని అంచనా వేయబడింది .

 

***



(Release ID: 1857558) Visitor Counter : 148