హోం మంత్రిత్వ శాఖ

రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ప్రారంభించబడింది, వివిధ అవార్డుల కోసం నామినేషన్ల ఆహ్వనం

Posted On: 05 SEP 2022 1:06PM by PIB Hyderabad

భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు / ఏజెన్సీ లు తమ తమ రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన కృషి చేసిన వ్యక్తులను సత్కరించడానికి అనేక పౌర పురస్కారాలు ఏర్పాటు చేశాయి.

 

వివిధ అవార్డుల కోసం నామినేషన్లు ఆహ్వానించడానికి , ఒక ఉమ్మడి జాతీయ అవార్డుల పోర్టల్ ( https://awards.gov.in ) ప్రభుత్వంచే అభివృద్ధి చేయబడింది, దీని వలన భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/ఏజెన్సీల అన్ని అవార్డులు అందజేయబడతాయి . 

 

పారదర్శకతతో పాటు ప్రజల భాగస్వామ్యం (జన్  భగీదారి) ఖచ్చితంగా ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ క్రిందకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ పోర్టల్ ఏర్పాటు చేయబడింది.

 

భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ అవార్డులకు పౌరులు, వ్యక్తులు/సంస్థలను నామినేట్ చేయడానికి వీలు కల్పించడం ఈ పోర్టల్ లక్ష్యం.

 

ప్రస్తుతం, కింది అవార్డుల కోసం నామినేషన్ / సిఫార్సులు  ఆహ్వానించబడ్డాయి : 

 

 i.         పద్మ పురస్కారాలు  - చివరి తేదీ 15/09/2022

 ii.        డిజిటల్ ఇండియా పురస్కారాలు - చివరి తేదీ 15/09/2022

iii.        నేషనల్ అవార్డ్ ఎక్సలెన్సీ ఇన్ ఫారెస్టీ-2022 (చివరి తేదీ 30 సెప్టెంబర్ 2022)

iv.        నేషనల్ గోపాల రత్న పురస్కారం-2022 (చివరి తేదీ 30 సెప్టెంబర్ 2022

v.        నేషనల్ వాటర్ అవార్డ్సు-2022 (చివరి తేదీ 15 సెప్టెంబర్ 2022)

vi.       నారీ శక్తి పురస్కారం-2023- చివరి తేదీ 31/10/2022

vii.      సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం-2023 చివరి తేదీ 30/09/2022

viii.      జీవన్ రక్షా పదక్ - చివరి తేదీ 30/09/2022

 

పురస్కారాలకు సంబంధించి మరిన్ని వివరాలు, నామినేషన్ల కోసం రాష్ట్రీయ  పురస్కార్  పోర్టల్  (https://awards.gov.in)    సందర్శించండి. 



(Release ID: 1856793) Visitor Counter : 159