ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
ధర మద్దతు పధకం మరియూ ధర స్థిరీకరణ నిధి కింద సేకరించిన చనా (పప్పు)ను పంపిణీ చేయడం మరియు ధర మద్దతు పధకం (PSS) కింద తుర్, ఉరద్ మరియు మసూర్లకు(పప్పులు) సంబంధించి పరిమాణ సేకరణ పరిమితిని 25% నుండి 40%కి పెంచడానికి క్యాబినెట్ ఆమోదించింది.
ఈ పథకం అమలు కోసం రూ. 1200 కోట్లు వెచ్చించారు
చానా పై పండించే రాష్ట్ర ధరపై కిలోకు రూ. 8 తగ్గింపు తో 15 లక్షల ఎం టి (MT) లభ్యత
సంక్షేమ పథకాలు/కార్యక్రమాలలో రాష్ట్రాలు/యూటీలు ఈ పప్పులను వినియోగించుకోవడానికి
प्रविष्टि तिथि:
31 AUG 2022 12:18PM by PIB Hyderabad
ధర మద్దతు పధకం (PSS) మరియు ధరల స్థిరీకరణ నిధి (PSF) కింద సేకరించిన పప్పు దినుసుల నిల్వల నుండి వివిధ సంక్షేమ పథకాలకు వినియోగించే ఛానా (పప్పులు)ను రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు చౌక రేటుతో పంపిణీ చేయడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. తుర్, ఉరద్ మరియు మసూర్లకు సంబంధించి ధర మద్దతు పధకం (PSS) కింద ఇప్పటికే ఉన్న 25% నుండి సేకరణ పరిమాణంపై పరిమితిని 40% వరకు పెంచడం.
ఈ ఆమోదించబడిన పథకం కింద ప్రభుత్వం రూ.8 తగ్గింపుతో 15 లక్షల ఎం టీ (MT) చానాను పంపిణీ కోసం రాష్ట్రాలు/యుటిలకు అవకాశం ఇచ్చారు. ముందుగా వచ్చే వారికి తొలి ప్రాధాన్యత ప్రాతిపదికన పండించే రాష్ట్ర ధరపై కిలోకు 8 ల తగ్గింపు రాష్ట్రాలు/యుటిలకు ఇచ్చారు. తమ రాష్ట్రాలు/యుటిలలో మధ్యాహ్న భోజనం, ప్రజా పంపిణీ వ్యవస్థ, సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమాలు (ICDP) మొదలైన వారి వివిధ సంక్షేమ పథకాలు/కార్యక్రమాలలో ఈ పప్పులను ఉపయోగించుకోవాలి. ఇది 12 నెలల కాలానికి లేదా 15 లక్షల మెట్రిక్ టన్నుల చానా నిల్వ ను పూర్తిగా పంపిణీ చేసే వరకు, ఏది ముందైతే అది పద్దతిలో ఒకేసారి పంపిణీ చేయబడుతుంది. ప్రభుత్వం రూ. ఈ పథకం అమలుకు 1200 కోట్లు వెచ్చించారు.
ఈ నిర్ణయాలు రాష్ట్రాలు/యుటిలు పౌరసరఫరాల వ్యవస్థ , మధ్యాహ్న భోజన పథకాలు మొదలైన వివిధ సంక్షేమ పథకాలలో చానాను ఉపయోగించుకునేలా చేస్తాయి. దీని వల్ల గిడ్డంగుల స్థలాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు, ధర మద్దతు పథకం కింద సేకరించిన తాజా నిల్వలను ఉంచడానికి రాబోయే రబీ సీజన్లో ఇది అవసరం. పప్పుధాన్యాల సాగులో రైతులకు లాభదాయకమైన ధరను పొందడంలో సహాయం చేస్తుంది, తద్వారా ఎక్కువ మంది రైతులు అధిక పెట్టుబడి పెట్టడం ద్వారా పప్పులను పండించేలా ప్రోత్సహిస్తుంది మరియు వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందడంలో వారికి సహాయపడుతుంది. అంతేకాకుండా, మన దేశంలో ఇటువంటి పప్పుధాన్యాల స్వయం సమృద్ధిని సాధించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ఇటీవలి కాలంలో దేశం ముఖ్యంగా గత మూడు సంవత్సరాలలో చానా ను (పప్పులు) అత్యధికంగా ఉత్పత్తి చేసింది. ధర మద్దతు పథకం కింద రబీ 2019-20, 2020-21 , 2021-22 కాలంలో చానాను భారత ప్రభుత్వం రికార్డు స్థాయిలో సేకరించింది. దీని కారణంగా, పి ఎస్ ఎస్ మరియు పి ఎస్ ఎఫ్ ( PSS & PSF ) కింద రాబోయే రబీ సీజన్లో కూడా 30.55 లక్షల మెట్రిక్ టన్నుల చనా ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటుంది, చనా ఉత్పత్తి బాగానే ఉంటుందని అంచనా. 22-23 సంవత్సరం లో ధర మద్దతు పథకం వల్ల చానా కనీస మద్దతు ధర పెరుగుదలతో అదనపు సేకరణను సాధిస్తుంది.
***
(रिलीज़ आईडी: 1855862)
आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam