ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తర్ప్రదేశ్ లో గల బాందా లో యమునా నది లో జరిగిన దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకుసంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 11 AUG 2022 10:22PM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్ లోని బాందా జిల్లా లో యమునా నది లో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల కు శ్రీ నరేంద్ర మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్థానిక పాలన యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ లో చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందజేస్తోందని ఆయన తెలిపారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని బాందా లో యమునా నది లో జరిగిన దుర్ఘటన హృద‌య‌విదారకం గా ఉంది. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వారి పట్ల నేను నా యొక్క శోకాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం రక్షణ సంబంధి మరియు సహాయ కార్యకలాపాల లో పూర్తి తత్పరత తో నిమగ్నం అయింది : ప్రధాన మంత్రి శ్రీ @narendramodi" అని తెలిపింది.

****

DS/ST

 


(रिलीज़ आईडी: 1851167) आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam