ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిడబ్ల్యుజి 2022 లో బాడ్ మింటన్ లోబంగారు పతకాన్ని గెలిచినందుకు శ్రీ లక్ష్య సేన్ కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి  

నాడు పోస్టు చేయడమైనది: 08 AUG 2022 6:56PM by PIB Hyderabad

బర్మింగ్ హమ్ లో జరిగిన కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో బాడ్ మింటన్ స్పర్ధ లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ లక్ష్య సేన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘శ్రీ @lakshya_sen అద్భుత కార్యసాధన ను చూసి అత్యంత ఉత్సాహితుడిని అయ్యాను. బాడ్ మింటన్ లో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు ఆయన కు అభినందన లు. కామన్ వెల్థ్ గేమ్స్ జరిగినంత కాలం లో ఆయన ఎల్లవేళ ల ఉత్కృష్టమైనటువంటి ఆట తీరు ను కనబరచడం తో పాటు ఫైనల్ మేచ్ జరిగినప్పుడు మరింత అసాధారణమైనటువంటి జవసత్వాలను చాటారు. ఆయన భారతదేశానికి గర్వకారణం గా నిలచారు. ఆయన భావి ప్రయాసల లో చక్కగా రాణించాలి అని కోరుకొంటూ అనేకానేక శుభాకాంక్ష లు అందజేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1850305) సందర్శకుల సూచీ సంఖ్య : : 175