ప్రధాన మంత్రి కార్యాలయం

పానీపత్ లో 2జి ఇథెనాల్ ప్లాంటు ను ఆగస్టు 10వ తేదీ నాడు దేశ ప్రజల కు అంకితంచేయనున్న ప్రధాన మంత్రి


ఈ ప్లాంటు లో ఏటా సుమారు మూడు కోట్ల లీటర్ ల ఇథెనాల్ ను తయారు చేయడానికిఇంచుమించు రెండు లక్షల టన్నుల వరి ఊక ను వినియోగించుకోవడం జరుగుతుంది

బయో ఫ్యూయల్ యొక్క ఈ ఉత్పాదన అదనపు ఆదాయాన్ని ఇచ్చే అవకాశాన్ని కల్పించడంద్వారా రైతుల ను శక్తివంతులను గా చేస్తుంది

ఈ చర్య ఒక్కో సంవత్సరం లో దాదాపు మూడు లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ తోసమానమైన ఉద్గారాలను   తగ్గించడం లోనూ తోడ్పడనుంది  

Posted On: 08 AUG 2022 5:27PM by PIB Hyderabad

హరియాణా లోని పానీపత్ లో ఏర్పాటు చేసినటువంటి రెండో తరం (2జి) ఇథెనాల్ ప్లాంటు ను ప్రపంచ బయో ఫ్యూయల్ దినం సందర్భం లో, 2022వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీ నాడు సాయంత్రం పూట 4 గంటల 30 నిమిషాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు.

దేశం లో బయో ఫ్యూయల్స్ ఉత్పాదన ను మరియు ఉపయోగాన్ని పెంచడం కోసం ప్రభుత్వం కొన్ని సంవత్సరాల తరబడి తీసుకొంటున్న అనేక చర్యల లో ఈ ప్లాంటు ను అంకితం చేయడం అనేది ఒక భాగం గా ఉంది. ఈ చర్య శక్తి రంగాన్ని మరింత తక్కువ ఖర్చు తో కూడినది గా, అందరి కి అందుబాటులో ఉండేది గా, వనరుల ను ఆదా చేసిది గా మరియు స్థిరత్వం కలిగింది గా తీర్చిదిద్దే దిశ లో ప్రధాన మంత్రి యొక్క నిరంతర ప్రయాసల కు అనుగుణం గా ఉంది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ లిమిటెడ్ (ఐఒసిఎల్) ద్వారా 900 కోట్ల రూపాయల కు పైబడిన అంచనా వ్యయం తో 2జి ఇథెనాల్ ప్లాంటు ను నిర్మించడం జరిగింది. ఈ ప్లాంటు పానీపత్ రిఫైనరీ కి సమీపం లో ఏర్పాటైంది. అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం పై ఆధారితం అయినటువంటి ఈ ప్రాజెక్టు ప్రతి సంవత్సరం లో సుమారు గా 3 కోట్ల లీటర్ ల ఇథెనాల్ ను తయారు చేయడానికి గాను ఒక్కో సంవత్సరం లో దాదాపు గా 2 లక్షల టన్నుల వరి దుబ్బు ను వినియోగించుకోవడం ద్వారా భారతదేశం లో వ్యర్థాల నుంచి ధనాన్ని ఆర్జించే ప్రయాసల దిశ లో ఒక కొత్త అధ్యాయాన్ని ఆరంభించగలుగుతుంది.

వ్యావసాయిక పంట ల అవశేషాల ను సంపూర్ణం గా వినియోగించుకోవడం ద్వారా రైతుల కు సాధికారిత ను కల్పించడం జరుగుతుంది. మరి వారి కి ఒక అదనపు ఆదాయార్జన మార్గాన్ని అనుసరించే అవకాశాన్ని అందించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ఈ యొక్క ప్లాంటు నిర్వహణ లో పాల్గొనే వ్యక్తుల కు ప్రత్యక్ష ఉపాధి ని కల్పించడం తో పాటుగా వరి గడ్డి ని నరికి వేయడం, దానిని సంబాళించడం, నిలవ చేయడం మొదలైన పనుల ద్వారా సప్లయ్ చైన్ లో తలమునక లు అయ్యే వారికి పరోక్ష ఉపాధి కూడా అందిరాగలదు.

ఈ ప్రాజెక్టు లో ద్రవ పదార్థాల విడుదల అంటూ ఏమీ ఉండదు. వరి గడ్డి పరకల ను మండించి వేయడాన్ని తగ్గించడం ద్వారా, ఈ ప్రాజెక్టు గ్రీన్ హౌస్ గ్యాసెస్ పరిమాణం లో ఏటా దాదాపు గా మూడు లక్షల టన్నుల బొగ్గు పులుసు వాయువు (కార్బన్ డయాక్సైడ్) ఉద్గారాల కు సమానమైన తగ్గింపున కు తోడ్పాటు ను అందించగలదు. అంటే ఒక రకం గా దేశం లో రహదారుల పై నుంచి ప్రతి సంవత్సరం సుమారు అరవై మూడు వేల కార్లు వైదొలగడం తో సమానం గా దీనిని అర్థం చేసుకోవచ్చు అన్నమాట.

 

***



(Release ID: 1850295) Visitor Counter : 194