ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

200 కోట్ల వేక్సీన్ డోజుల ను మించి పోయినందుకు గాను ప్రధాన మంత్రి కి అభినందనలు తెలిపిన శ్రీ బిల్ గేట్స్


శాస్త్రవేత్తలు, వైద్యులు మరియు నర్సుల ఉమ్మడి కృషి ని ప్రశంసించిన ప్రధానమంత్రి

Posted On: 20 JUL 2022 3:13PM by PIB Hyderabad

భారతదేశం లో ప్రజల కు టీకా మందును ఇప్పించే కార్యక్రమాని కి పెద్ద దన్ను గా నిలవడం లో శాస్త్రవేత్త లు, వైద్యులు మరియు నర్సు ల సామూహిక ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

శ్రీ బిల్ గేట్స్ అభినందన పూర్వకం గా చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి జవాబు ఇస్తూ -

‘‘భారతదేశం లో ప్రజల కు టీకా మందు ను ఇప్పించే కార్యక్రమం స్థాయి ని, వేగాన్ని బట్టి చూసినప్పుడు అతి పెద్దది గా ఉంది. దీని కి ఎంతో మంది యొక్క - వారి లో శాస్త్రవేత్త లు, వైద్యులు మరియు నర్సు లు కలసి ఉన్నారు- సామూహిక ప్రయత్నాలు అండ గా నిలచాయి. అదే కాలం లో, భారతదేశ ప్రజలు విజ్ఞాన శాస్త్రం పట్ల చెప్పుకోదగ్గ విశ్వాసాన్ని చాటుకొని, వారి డోజుల ను సకాలం లో స్వీకరించారు.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS

 


(Release ID: 1843171)