భారత ఎన్నికల సంఘం

రాష్ట్రపతి ఎన్నిక -2022 పోలింగ్ ప్రశాంతం


రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజ్ జాబితా లోని మొత్తం 4796 మంది లో ఓటు హక్కు వినియోగించుకున్న 99% మందికి పైగా ఓటర్లు

11 రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం నుంచి 100 శాతం మంది ఎమ్మెల్యేల ఓటింగ్

Posted On: 18 JUL 2022 7:21PM by PIB Hyderabad

దేశంలో అత్యున్నత భారత రాష్ట్రపతి పదవికి ఎన్నిక కోసం పోలింగ్ ఈ రోజు పార్లమెంటు భవనంలోనూ, ఢిల్లీలోని ఎన్ సి టి , పుదుచ్చేరి యుటితో సహా రాష్ట్ర శాసనసభలలోని 30 చొప్పున ప్రదేశాలలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ,పారదర్శకంగా ముగిసింది. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని 324వ అధికరణం ప్రకారం నిర్వహించే అత్యంత ముఖ్యమైన ఎన్నికలలో రిపబ్లిక్ అధ్యక్ష పదవికి ఎన్నిక ఒకటి. 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో శ్రీమతి ద్రౌపది ముర్ము,  శ్రీ యశ్వంత్ సిన్హా పోటీ పడ్డారు.ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 31 ప్రదేశాలలో పోలింగ్ జరిగింది.

 

రాజ్యాంగంలోని 54వ అధికరణం ప్రకారం, భారత రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు, వీరిలో (ఎ) పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, మరియు (బి) అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు (ఢిల్లీ యొక్క జాతీయ రాజధాని ప్రాంతం , కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో సహా) ఉన్నారు. ఢిల్లీ ఎన్సీటీ, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో సహా పార్లమెంటు లేదా రాష్ట్రాల శాసనసభలకు నామినేట్ అయిన సభ్యులను  ఎలక్టోరల్ కాలేజీలో చేర్చడానికి అర్హులు కారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల

1974 నిబంధనలకు  సంబంధించి రూల్ 40 ప్రకారం భారత ఎన్నికల సంఘం ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల జాబితాను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాజ్యసభ, లోక్ సభ, రాష్ట్రాల లెజిస్లేటివ్ అసెంబ్లీలు, ఢిల్లీ ఎన్సీటీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికైన సభ్యుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 1951 ఆర్.పి. చట్టం, 1951లోని సెక్షన్ 8 ప్రకారం అనర్హత వేటు పడిన కారణంగా శ్రీ అనంత్ కుమార్ సింగ్, శ్రీ మహేంద్ర హరి దాల్వి అనే ఇద్దరు సభ్యులను  ఈ రోజు ఎన్నికలలో ఓటు వేయడానికి అనర్హులుగా ప్రకటించారు. రాజ్యసభలో 05, రాష్ట్ర శాసనసభల్లో 06 ఖాళీలు ఉన్నాయి. అందుచేత ఈ అధ్యక్ష ఎన్నికలలో పాల్గొనడానికి ఎలక్టోరల్ కాలేజ్ జాబితాలో మొత్తం 4796 మంది ఓటర్లు ఉన్నారు.

న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో రూమ్ నెం.63, అన్ని రాష్ట్ర శాసనసభ సచివాలయాల్లోని మరో 30 ప్రదేశాల (ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో సహా) ను పోలింగ్ కేంద్రాలుగా నిర్ణయించారు. పార్లమెంటు సభ్యులు న్యూఢిల్లీలో ఓటు వేశారు ఢిల్లీ ఎన్ సి టి , కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభ సభ్యులతో సహా రాష్ట్ర శాసనసభల సభ్యులు ప్రతి శాసనసభలో నిర్దేశించిన నిర్ణయించిన స్థలంలో ఓటు వేశారు. కాగా, , పార్లమెంటు/ శాసన సభ సభ్యులు ఎవరైనా తమ స్వంతం కాకుండా ఏదైనా ఇతర పోలింగ్ కేంద్రం లో ఓటు వేయడానికి కూడా కమిషన్ సౌకర్యాలు కల్పించింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో 44 మంది ఎంపీలు, పార్లమెంట్ హౌస్ లో  09 మంది ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్ర ప్రధాన కార్యాలయాల్లో 02 మంది ఎమ్మెల్యేలను ఓటు వేసేందుకు అనుమతించారు.

అందుతున్న నివేదికల ప్రకారం, మొత్తం 771 మంది పార్లమెంటు సభ్యులలో (05 ఖాళీ) అదే విధంగా మొత్తం 4025 మంది శాసనసభ సభ్యులలో (06 ఖాళీ , 02 అనర్హులు) 99% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఛత్తీస్ గఢ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు నుంచి నూటికి నూరు శాతం మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటింగ్ గోప్యత, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక పోలింగ్ నిర్వహణ కు అమలు చేసిన ప్రత్యేక చర్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

 

*ఓటు ప్రాధాన్యతను గుర్తించడానికి ఓటరు మరే ఇతర పరికరాన్ని ఉపయోగించకుండా ఎన్నికల సంఘం అందరికీ వయొలెట్ ఇంక్ తో ప్రత్యేక సీరియల్ నంబర్డ్ పెన్నులను  అందించింది.

ఆర్. ఓ/ఏ ఆర్ ఓ లు/ సి ఇ ఓ లు/ ఇ సిఐ అధికారులు, / RO/AROలు/CEOలు/ECI ఆఫీసర్ లు, ఇ సిఐ  పరిశీలకులు సెక్యూరిటీ సిబ్బంది మొదలైన వారి కోసం వివిధ వాట్స్ యాప్ గ్రూపులు ఏర్పరిచారు. స్టేట్ హెడ్ క్వార్టర్స్, పార్లమెంట్ , ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించడానికి , సమన్వయం చేయడానికి వీటిని విస్తృతంగా ఉపయోగించారు.

*ఎన్నికల ప్రక్రియతో పాటు పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా  నిఘా ఉంచడానికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు పార్లమెంట్ లో కూడా పరిశీలకులను నియమించారు.      

*పార్లమెంటు హౌస్ వద్ద కౌంటింగ్ ప్రక్రియ కోసం ఇద్దరు పరిశీలకులను కూడా నియమించారు.

16వ రాష్ట్రపతి ఎన్నిక- 2022 కోసం ప్రవేశపెట్టిన కొత్త అంశాలలో ఇవి ఉన్నాయి:

*కోవిడ్-19 పాజిటివ్ ఓటర్లకు వెసులుబాటు - కోవిడ్ -19 పాజిటివ్ ఉన్న ఓటర్లు పోలింగ్ చివరి గంటలో లేదా నాన్-కోవిడ్ ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ / సంబంధిత రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎప్పటికప్పుడు జారీ చేసిన అన్ని కోవిడ్ మార్గదర్శకాలు / సూచనలను పాటించడం ద్వారా ఓటు వేయడానికి కమిషన్ అనుమతించింది. తమిళనాడు శాసనసభలో ఇద్దరు కోవిడ్-19 పాజిటివ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, ఒక కోవిడ్ -19 పాజిటివ్ పార్లమెంటు సభ్యుడు కేరళలోని తిరువనంతపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

• ఈ సారి కమిషన్ సంబంధిత రిటర్నింగ్ అధికారి , అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను పర్యావరణ-స్నేహపూర్వక , బయో డిగ్రెడబుల్ పదార్థాలను  వాడేందుకు, భారత ప్రభుత్వ ప్రస్తుత సూచనల ప్రకారం నిషేధిత ప్లాస్టిక్ / పదార్థాలను వినియోగించరాదని 

ఆదేశించింది.  

 

మేఘాలయలో గ్రీన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు

చేశారు.

రాజ్యాంగంలోని 55(3) అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి పదవికి ఎన్నిక అనేది ఒకే బదిలీ ఓటు ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థకు అనుగుణంగా జరుగుతుంది ఈ ఎన్నికలలో ఓటింగ్ రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. రాజ్యాంగం (ఎనభై-నాల్గవ) సవరణ చట్టం, 2001 ప్రకారం, 2026 సంవత్సరం తరువాత తీసుకోవలసిన మొదటి జనాభా గణన కోసం సంబంధిత జనాభా గణాంకాలు ప్రచురించబడే వరకు, రాష్ట్రపతి ఎన్నికల కోసం ఓట్ల విలువను లెక్కించే ఉద్దేశ్యాల కోసం రాష్ట్రాల జనాభా 1971-జనాభా లెక్కలలో నిర్ధారించబడిన జనాభా అని సూచిస్తుంది.

2022 జూలై 12 ,13 తేదీల్లో ఈసిఐ నుంచి రాష్ట్రాలకు ఖాళీ బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా , అంతరాయం లేకుండా పంపడానికి కట్టుదిట్టమైన (ఫూల్ ప్రూఫ్) భద్రత కల్పించారు. పోలైన ఓట్ల తో కూడిన 30 బ్యాలెట్ బాక్సులను తిరిగి తీసుకురావడానికి కూడా రాష్ట్ర బృందాలకు ఇదే విధమైన రవాణా ఏర్పాట్లు జరిగాయి.అన్ని బ్యాలెట్ బాక్సులు , ఇతర ఎన్నికల సామగ్రి జూలై 19 నాటికి పార్లమెంటు హౌస్ అంటే కౌంటింగ్ ప్రదేశానికి చేరుకుంటుంది. ఓట్ల లెక్కింపు జూలై 21, 2022న ఉదయం 11 గంటలకు మొదలవుతుంది.

 

****



(Release ID: 1842525) Visitor Counter : 875