ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్ లో జరిగిన బస్సు దుర్ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లినందుకుసంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి 

Posted On: 18 JUL 2022 1:46PM by PIB Hyderabad

మధ్య ప్రదేశ్ లోని ధార్ లో జరిగిన బస్సు దుర్ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ)ఒక ట్వీట్ లో -

‘‘మధ్య ప్రదేశ్ లోని ధార్ లో జరిగిన బస్సు ప్రమాదం దుఃఖదాయకం గా ఉంది. ప్రియతముల ను కోల్పోయిన వ్యక్తుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. రక్షణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి; బాధితుల కు స్థానిక అధికారులు సాధ్యమైన అన్ని విధాలుగాను సహాయాన్ని అందజేస్తున్నారు: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.

***

DS/SH

 


(Release ID: 1842377)