ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గురు పూర్ణిమ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 13 JUL 2022 9:33AM by PIB Hyderabad

మంగళప్రదమైనటువంటి గురు పూర్ణిమ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘గురు పూర్ణిమ సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. మనకు ప్రేరణ ను అందించినటువంటి, మనకు మార్గదర్శనం చేసినటువంటి మరియు మనకు జీవనాన్ని గురించి ఎంతో నేర్పించినటువంటి ఆదర్శ గురువులు అందరికీ కృతజ్ఞత ను వ్యక్తం చేసేటటువంటి రోజు ఇది. నేర్చుకోవడానికి మరియు జ్ఞానార్జన కు మన సమాజం అత్యధిక ప్రాముఖ్యాన్ని కట్టబెడుతోంది. మన గురువు ల ఆశీర్వాదాలు భారతదేశాన్ని సరికొత్త శిఖరాల కు చేర్చాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

*****

DS/ST

 


(రిలీజ్ ఐడి: 1841158) సందర్శకుల సూచీ సంఖ్య : : 166