ప్రధాన మంత్రి కార్యాలయం

జర్మనీ లోని  మ్యూనిఖ్ లో భారతీయ సముదాయం తో భేటీ అయిన ప్రధానమంత్రి

Posted On: 26 JUN 2022 7:58PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జర్మనీ లో నివసిస్తున్న భారతీయ సముదాయం తో మ్యూనిఖ్ లోని ఆడీ డోమ్ లో సమావేశమై, వారి ని ఉద్దేశించి ప్రసంగించారు. జర్మనీ లో అత్యంత క్రియాశీలంగా ఉంటున్న మరియు ఉత్సాహం నిండిన భారతీయ సముదాయం లోని వేలకొద్దీ సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశం యొక్క వృద్ధి గాథ ను గురించి ప్రముఖం గా పేర్కొన్నారు. అంతేకాకుండా, దేశం యొక్క అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక ను మరింత గా ముందుకు తీసుకు పోవడం కోసం ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. భారతదేశం యొక్క విజయ గాథ ను ప్రోత్సహించడం లోను, అలాగే భారతదేశం యొక్క సాఫల్యాన్ని గురించి బ్రాండ్ అంబాసిడర్ లుగా ప్రచారం చేయడం లోను ప్రవాసీ భారతీయులు అందిస్తున్న అమూల్యమైన తోడ్పాటు ను కూడా ప్రధాన మంత్రి ప్రశంసించారు.

**



(Release ID: 1837262) Visitor Counter : 104