ప్రధాన మంత్రి కార్యాలయం

‘వాణిజ్య భవన్’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; ‘నిర్యాత్ పోర్టల్’ ను కూడా ఆయన ప్రారంభించారు


‘‘పౌరులకు కేంద్ర స్థానాన్ని ఇచ్చే పాలన దిశ లో దేశం పయనిస్తున్నది’’

‘‘డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ యొక్క విధానాలు, నిర్ణయాలు, సంకల్పం మరియు వాటి సాధన అనేవిస్వతంత్ర భారతదేశాని కి దిశ ను ఇవ్వడం లో చాలా ముఖ్యమైనవిగా ఉండేవి’’

‘‘ప్రభుత్వం మరియు ప్రభుత్వ పథకాల కై సులభ ప్రాప్తత కు పూచీపడడం అనేది ఒకప్రధానమైన ప్రాథమ్యం గా ఉన్నది’’

‘‘ప్రాజెక్టు లు మరియు పథకాలు అనుకున్న కాలాని కిపూర్తి అయినప్పుడే పన్ను చెల్లింపుదారు ను గౌరవించినట్లు అవుతుంది’’

‘‘వాణిజ్య భవన్ కు పునాది వేసినప్పటి నుంచి ఆ భవనాన్ని ప్రారంభించిన కాలంవరకు పరివర్తనాత్మకమైన పురోగతి చోటు చేసుకొంది’’

‘‘ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనేస్థాయి నుంచి అభివృద్ధి చెందిన దేశం అనే స్థితి కి మార్పు చెందడం లో ఎగుమతులు ఒకముఖ్య పాత్ర ను పోషిస్తాయి’’ 

Posted On: 23 JUN 2022 12:31PM by PIB Hyderabad

వాణిజ్య భవన్ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో ఈ రోజు న ప్రారంభించారు. దీనితో పాటునిర్యాత్ పోర్టల్ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో కేంద్ర మంత్రులు శ్రీ పీయూష్ గోయల్, శ్రీ సోం ప్రకాశ్, శ్రీమతి అనుప్రియ పటేల్ తదితరులు ఉన్నారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు న్యూ ఇండియా లో పౌరులు కేంద్ర స్థానం లో నిలచిన పాలన సంబంధిత ప్రయాణం లో మరొక ముఖ్యమైన అడుగు ను వేయడం జరిగింది; ఈ మార్గం లో దేశం గత 8 సంవత్సరాలుగా సాగిపోతూంది అన్నారు. దేశం ఈ రోజు న ఒక కొత్త మరియు ఆధునిక వాణిజ్య భవన్ తో పాటు ఒక ఎగుమతుల పోర్టల్ ను కూడా కానుక గా అందుకొంది. వీటిలో ఒకటి భౌతిక రూపం లోని మౌలిక సదుపాయం కాగా, మరొకటి డిజిటల్ మాధ్యమం లో అందిన మౌలిక సదుపాయం అని ఆయన అన్నారు.

దేశాని కి ఒకటో పరిశ్రమల శాఖ మంత్రి అయిన డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ యొక్క వర్థంతి కూడా ఈ రోజే అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఆయన విధానాలు, ఆయన నిర్ణయాలు, ఆయన సంకల్పం, మరి ఆయన సంకల్పాల ను సాధించడం అనేవి స్వాతంత్య్ర భారతదేశాని కి దిశ ను అందించడం లో ఎంతో ముఖ్యమైనవి గా ఉండేయి. ఇవాళ దేశం ఆయన కు తన వినమ్ర శ్రద్ధాంజలి ని అర్పిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

మంత్రిత్వ శాఖ కు సమకూరిన ఒక కొత్త మౌలిక సదుపాయాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇది వ్యాపార నిర్వహణ లో సౌలభ్యం కోసం చేసిన ప్రతిజ్ఞ ను నవీకరించే కాలం కూడా; తద్ద్వారా జీవన సౌలభ్యాన్ని’ సైతం పొందే కాలమూను అన్నారు. ప్రాప్తి లో సౌలభ్యం అనేది ఈ రెండిటి కి మధ్య ఒక లంకె గా ఉంది అని ఆయన అన్నారు. ప్రభుత్వం తో సమాచారాన్ని చేరవేయడం లో ఎలాంటి అంతరాయం తలెత్తకూడదు, అలాగే ప్రభుత్వాన్ని సులభమైన రీతి లో అందరికీ అందుబాటు లో ఉండేటట్లు చూడటం లో నూ ఎటువంటి అవరోధాలు తలెత్తకూడదు అన్నది ప్రభుత్వ ప్రాధాన్యం గా ఉంది అని ఆయన అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల లో ఈ దృష్టి కోణం స్పష్టం గా ప్రతిబింబిస్తోందని కూడా ఆయన అన్నారు.

ఇటీవలి అనేక ఉదాహరణల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ‘న్యూ ఇండియాయొక్క నూతన కార్య సంస్కృతి లో ప్రాజెక్టు లు పూర్తి అయ్యే తేదీ అనేది ఎస్ఒపి లో భాగంగా ఉంది; మరి దానిని తప్పక పాటించవలసిందే అన్నారు. ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు లు ఏళ్ళ తరబడి అటకెక్కకుండా సకాలం లో పూర్తి అయినప్పుడే, ప్రభుత్వ పథకాలు వాటి లక్ష్యాల ను చేరుకొన్నప్పుడే దేశం లో పన్ను చెల్లింపుదారు కు గౌరవం లభించినట్లు అవుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్ రూపం లో మనం ఒక ఆధునిక ప్లాట్ ఫార్మ్ ను ఏర్పాటు చేసుకొన్నాం కూడా అని ఆయన చెప్పారు. ఈ వాణిజ్య భవన్ దేశం యొక్క గతిశక్తికి జోరు ను అందిస్తుంది అని ఆయన అన్నారు.

ఈ కొత్త వాణిజ్య భవన్ ఈ కాలఖండం లో వాణిజ్య రంగం లో మేం సాధించిన విజయాల కు కూడా ఒక సంకేతం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. పునాది రాయి వేసిన కాలాన్ని గురించి ఆయన గుర్తుకు తీసుకు వస్తూ, అప్పట్లో నేను నూతన ఆవిష్కరణ మరియు గ్లోబల్ ఇనోవేశన్ ఇండెక్స్ లో మెరుగుదల చోటు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని స్పష్టం చేశాను. ప్రస్తుతం భారతదేశం గ్లోబల్ ఇనొవేశన్ ఇండెక్స్ లో 46వ స్థానం లో నిలచింది. మరి ప్రస్తుతం మనం గ్లోబల్ ఇనోవేశన్ ఇండెక్స్ లో నిరంతరం మెరుగుపడుతున్నాం అని ఆయన అన్నారు. ఆ కాలం లో తాను వ్యాపారం నిర్వహణ లో సౌలభ్యాన్ని మెరుగు పరచడం గురించి కూడా మాట్లాడినట్లు చెప్తూ, ఈ రోజున 32,000కు పైచిలుకు అనవసరమైన నియమాల పాలన ను తొలగించడమైందన్నారు. అదే విధం గా భవన్ కు శంకుస్థాపన జరిగిన కాలం లో జిఎస్ టి అనేది ఒక సరికొత్త అంశం అ, మరి ప్రస్తుతం ప్రతి నెల కు ఒక లక్ష కోట్ల రూపాయల మేరకు జిఎస్ టి వసూళ్ళు పరిపాటి గా మారింది అని ఆయన అన్నారు. జిఇఎమ్ ( GeM ) కోణం లో చూసినప్పుడు, 9,000 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ లు గురించి అప్పట్లో చర్చించడం జరిగిందని, ప్రస్తుతం 45 లక్షల కు పైగా చిన్న నవపారిశ్రామికులు పోర్టల్ లో నమోదై ఉన్నారని, అలాగే 2.25 కోట్ల కు పైబడిన ఆర్డర్ లు లభించాయి అని వివరించారు. 2014వ సంవత్సరం లో రెండు మొబైల్ యూనిట్ లు మాత్రమే ఉన్నవి కాస్తా అప్పటికి దాదాపు 120 మొబైల్ యూనిట్ లకు పెరిగాయి అని ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ, నేడు ఈ సంఖ్య 200 ను మించిపోయింది అన్నారు. ప్రస్తుతం భారతదేశం లో 2300 నమోదిత ఫిన్-టెక్ స్టార్ట్అప్స్ ఉన్నాయి, అదే నాలుగు సంవత్సరాల క్రితం వీటి సంఖ్య 500 లగా ఉంది అన్నారు. వాణిజ్య భవన్ కు పునాది రాయి పడిన కాలం లో భారతదేశం ప్రతి సంవత్సరం లో 8000 స్టార్ట్అప్స్ ను గుర్తిస్తూ ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 15000 కు పైబడింది అని ప్రధాన మంత్రి తెలిపారు.

 

గత సంవత్సరం లో ప్రపంచవ్యాప్తం గా చరిత్రాత్మకమైన అంతరాయాలు చోటు చేసుకొన్నప్పటి కీ భారతదేశం యొక్క ఎగుమతులు మొత్తం 670 బిలియన్ డాలర్, అంటే రూపాయల లో చూసినప్పుడు 50 లక్షల కోట్ల రూపాయల వద్ద నిలచాయి అని ప్రధాన మంత్రి అన్నారు. కిందటి సంవత్సరం లో ప్రతి ఒక్క సవాలు తలెత్తినప్పటికీ 400 బిలియన్ డాలర్ విలువ గల వస్తురూప ఎగుమతుల స్థాయిని అధిగమించాలి అని నిర్ణయించుకొంది. ఇక్కడ 400 బిలియన్ డాలర్ అంటే అది 30 లక్షల కోట్ల రూపాయల కు సమానం. మనం దీనిని దాటిపోయి, 418 బిలియన్ డాలర్ విలువ గల ఎగుమతుల తో ఒక కొత్త రెకార్డు ను సృష్టించాం. మరి ఇది 31 లక్షల కోట్ల రూపాయల కు సమానం గా ఉంది అని ఆయన అన్నారు. ‘‘గత సంవత్సరాల లో సాధించినటువంటి ఈ సాఫల్యం ఇచ్చిన ప్రోత్సాహం తో, మనం ప్రస్తుతం మన ఎగుమతి లక్ష్యాల ను పెంచివేసుకొన్నాం. మరి వాటి ని సాధించేందుకు మన ప్రయాసల ను రెండింతలు చేశాం. ఈ కొత్త లక్ష్యాల ను సాధించాలి అంటే అందుకు ప్రతి ఒక్కరి సామూహిక ప్రయత్నం చాలా అవసరం అని ప్రధాన మంత్రి అన్నారు. కేవలం అల్పకాలిక లక్ష్యాలనే కాకుండా దీర్ఘకాలిక లక్ష్యా ల ను పెట్టుకోవాలి’’ అని కూడా ఆయన అన్నారు.

 

నేశనల్ ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ ఫార్ ఇయర్లీ అనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ పోర్టల్ (ఎన్ఐఆర్ వైఎటి’.. దీనికి సంక్షిప్త రూపం నిర్యాత్’) సంబంధిత వర్గాలు అన్నింటికీ రియల్ టైమ్ డాటా ను అందించడం ద్వారా ఆ వర్గాలు వాటి మధ్య గిరి గీసుకొన్న ధోరణి ని ఛేదించడం లో సహాయకారి అవుతుంది అని ప్రధానమంత్రి అన్నారు. ‘‘ఈ పోర్టల్ ద్వారా ప్రపంచం లో 200 కు పైగా దేశాల కు ఎగుమతులు జరిపే 30 కి పైగా కమొడిటీ గ్రూప్స్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందుబాటు లోకి వస్తుంది. రాబోయే కాలం లో జిల్లా వారీ ఎగుమతుల కు సంబంధించిన సమాచారం కూడా ఇందులో అందుబాటు లోకి వస్తుంది. ఇది జిల్లాల ను ఎగుమతుల కు ముఖ్య కేంద్రాలు గా అభివృద్ధి పరచడం కోసం సాగే ప్రయాసల ను సైతం బలపరుస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఏదైనా దేశం అభివృద్ధి చెందుతున్న దేశం దశ నుంచి అభివృద్ధి చెందిన దేశం దశ కు మార్పు చెందడం లో ఎగుమతులు అధికం కావడం అనేది ముఖ్య పాత్ర ను పోషిస్తుంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. గడచిన 8 సంవత్సరాల లో భారతదేశం కూడా తన ఎగుమతుల ను పెంచుకొంటూ ఎగుమతి లక్ష్యా ల ను అందుకొంటోంది అని ప్రధాన మంత్రి చెప్పారు. ఎగుమతుల ను పెంచుకోవడం కోసం ఉత్తమమైనటువంటి విధానాల ను అనుసరించడం, ప్రక్రియ ను సులభతరం గా మార్చడంతో పాటు ఉత్పత్తుల ను కొత్త బజారుల కు తీసుకు పోవడం ఎంతగానో దోహదపడ్డాయి అని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం లోని ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ, ప్రతి ఒక్క విభాగం ‘సంపూర్ణ ప్రభుత్వం’ వైఖరి తో ఎగుమతుల ను పెంచడానికి పెద్ద పీట ను వేస్తోంది అని ఆయన అన్నారు. అది ఎమ్ఎస్ఎమ్ఇ మంత్రిత్వ శాఖ కావచ్చు, లేదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు లేదా వాణిజ్య శాఖ కావచ్చు.. అన్ని శాఖలు ఒక ఉమ్మడి లక్ష్యం కోసం సమష్టి గా ప్రయత్నాలు చేస్తున్నాయి అని ఆయన అన్నారు. ‘‘కొత్త రంగాల నుంచి ఎగుమతులు వృద్ధి చెందుతున్నాయి. అనేక ఆకాంక్షభరిత జిల్లాల నుంచి సైతం ఎగుమతులు ప్రస్తుతం అనేక రెట్ల మేర పెరిగాయి పత్తి ఎగుమతులు మరియు చేనేత ఉత్పత్తుల ఎగుమతుల లో 55 శాతం పెరుగుదల అనేది క్షేత్ర స్థాయి లో జరుగుతూ ఉన్న కృషి ఏమిటి అనేది చాటుతున్నది’’ అని ఆయన అన్నారు.

వోకల్ ఫార్ లోకల్ప్రచార ఉద్యమం ద్వారా, ‘వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్స్కీము ద్వారా స్థానిక ఉత్పత్తుల కు ప్రభుత్వం ప్రాధాన్యాన్ని కట్టబెట్టడం అనేది కూడా ఎగుమతులు అధికం కావడానికి తోడ్పడింది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం మన ఉత్పత్తుల లో అనేకం ప్రపంచం లోని కొత్త దేశాల కు మొదటిసారి గా ఎగుమతి అవుతున్నాయి. ‘‘మన స్థానిక ఉత్పత్తులు శరవేగం గా ప్రపంచ ఉత్పత్తులు గా రూపొందుతున్నాయి’’ అని ఆయన అన్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి బహ్రెయిన్ కు ఎగుమతి అవుతున్న సీతాభోగ్ మిఠాయి ని గురించి, లండన్ కు పోతున్న నాగాలాండ్ కు చెందిన తాజా కింగ్ బ్రాండ్ మిర్చి ని గురించి, దుబయ్ కి ఎగుమతి అవుతున్న అసమ్ కు చెందిన తాజా బర్మీస్ ద్రాక్ష పండ్ల ను గురించి, ఫ్రాన్స్ కు ఎగుమతి అవుతున్న ఛత్తీస్ గఢ్ కు చెందిన ఆదివాసీ మహువా ఉత్పత్తుల ను గురించి, అలాగే దుబయి కి ఎగుమతి అవుతున్న కార్ గిల్ ప్రాంత ఖుమానీ పండ్ల ను గురించి ఉదాహరణలు గా వివరించారు.

ఇటీవల తీసుకొన్న చర్యల ను గురించి ప్రధాన మంత్రి మరోమారు నొక్కిచెప్తూ, ‘‘మనం మన రైతుల ను, నేతకారులను మరి మన సాంప్రదాయక ఉత్పత్తుల విషయం లో ఎగుమతి సంబంధిత ఇకో-సిస్టమ్ తో జతపరచడం కోసం జిఐ ట్యాగింగ్ విషయం లోనూ అవగాహన ను కల్పిస్తున్నాం; అలాగే నియమాల ను గురించి తెలియజెప్తున్నాం కూడా’’ అన్నారు. కిందటి సంవత్సరం లో యుఎఇ తో మరియు ఆస్ట్రేలియా తో కుదిరిన వ్యాపార ఒప్పందాల ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇతర దేశాల తో సైతం బోలెడంత ప్రగతి చోటు చేసుకొంది అని ఆయన వెల్లడించారు. ఎన్నో సవాళ్ళ తో కూడుకొన్నటువంటి ఒక వాతావరణాన్ని భారతదేశాని కి అందివస్తున్న అవకాశాలు గా మార్పిడి చేయడం కోసం విదేశాల లోని భారతదేశ దౌత్య సంస్థ లు కఠోరం గా శ్రమిస్తున్నాయి అంటూ ఆయన ప్రశంసించారు. ‘‘వ్యాపారం జరగాలి అంటే గనుక కొత్త బజారుల ను గుర్తించడం, అవసరాల కు అనుగుణం గా ఉత్పత్తుల ను తయారు చేయడం అనేవి దేశ పురోగతి కి ఎంతో ముఖ్యమైన అంశాలు’’ అని ఆయన అన్నారు.

చివరలో, ఇటీవలి కాలం లో అభివృద్ధి పరచిన పోర్టల్స్ ను మరియు ప్లాట్ ఫార్మ్ స్ ను క్రమం తప్పక సమీక్షిస్తూ ఉండవలసిందిగా ప్రతి విభాగాన్ని ప్రధాన మంత్రి కోరుతూ తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘ఏ లక్ష్యాల తో అయితే మనం ఈ ఉపకరణాల ను అభివృద్ధి పరచామో, ఆ లక్ష్యాల ను ఎంతవరకు సాధిస్తున్నామో, మరి ఒకవేళ ఏదయినా సమస్య అంటూ ఎదురైతే అప్పుడు ఆయా సమస్యల ను పరిష్కరించడం కోసం తప్పక ప్రయత్నాల ను చేయాలి’’ అని ఆయన సూచించారు.

***

DS/AK

 



(Release ID: 1836726) Visitor Counter : 168