ప్రధాన మంత్రి కార్యాలయం

అఫ్ గానిస్తాన్ లో సంభవించిన భూకంపం లో ప్రాణనష్టం వాటిల్లినందుకుసంతాపం తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 22 JUN 2022 9:28PM by PIB Hyderabad

అఫ్ గానిస్తాన్ లో సంభవించిన భూకంపం లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘అఫ్ గానిస్తాన్ లో ఈ రోజు న వినాశకారి భూకంపం సంభవించిందన్న వార్త తెలిసి ప్రగాఢ దుఃఖం కలిగింది. అమూల్యమైనటువంటి ప్రాణాలకు నష్టం వాటిల్లినందుకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.

ఈ కఠిన పరిస్థితి లో అఫ్ గానిస్తాన్ ప్రజల వెన్నంటి భారతదేశం నిలవడం తో పాటుగా చేతనైన అన్ని రకాలు గాను విపత్తు సంబంధిత సహాయక సామగ్రి ని శీఘ్ర గతి న అందించడాని కి కూడా తయారు గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/AK

 

 



(Release ID: 1836475) Visitor Counter : 79