నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

భారతదేశంలోని 200 ప్రాంతాల్లో జూన్ 13న ప్రధాన్ మంత్రి నేషనల్ అప్రెంటీస్‌షిప్ మేళా నిర్వహించబడుతుంది


36+ రంగాలు, 500+ ట్రేడ్‌లు మరియు 1000+ కంపెనీలు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ మేళాలో పాల్గొంటాయి.

Posted On: 13 JUN 2022 9:13AM by PIB Hyderabad

యువతకు కార్పొరేట్‌లలో ఆన్‌గ్రౌండ్ శిక్షణ మరియు ఉపాధిని పొందేందుకు మరిన్ని అవకాశాలతో అనుసంధానం చేయాలనే లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఇప్పుడు ప్రతి నెలా ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళాను నిర్వహిస్తుంది. అదే క్రమంలో 13 జూన్, 2022న ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు మేళా నిర్వహించబడుతుంది. పీఎం నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా భారతదేశంలోని 200+ స్థానాల్లో జరుగుతుంది. 36+ రంగాల నుండి 1000 కంటే ఎక్కువ కంపెనీలు మేళాలో పాల్గొంటాయి, కంపెనీలలో అప్రెంటిస్‌గా నియమించుకునే అవకాశాలను అందిస్తాయి. 5  నుండి 12వ తరగతి పాస్ సర్టిఫికేట్, నైపుణ్య శిక్షణ సర్టిఫికేట్, ఐటీఐ డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న వ్యక్తులు ఈ ట్రేడ్‌లు/అవకాశాలలో ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, హౌస్ కీపర్లు, బ్యూటీషియన్లు, మెకానిక్‌లు మొదలైన 500 కంటే ఎక్కువ ట్రేడ్‌ల ఎంపిక ఇవ్వబడుతుంది.



ఈ నగరాల నుండి అప్రెంటిస్‌ల నియామకాన్ని ప్రోత్సహించడం, అలాగే వారి కార్యాలయానికి విలువను తీసుకురావడానికి శిక్షణ మరియు ఆచరణాత్మక నైపుణ్యాల ద్వారా వారి సామర్థ్యాన్ని గుర్తించడం మరియు అభివృద్ధి చేయడంలో యజమానులకు సహాయం చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం.

అభ్యర్థులు తమ శిక్షణ వ్యవధి ముగింపులో నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సివిఈటీ)చే గుర్తింపు పొందిన అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్‌లను కూడా అందుకుంటారు. ఇది వారికి పరిశ్రమ గుర్తింపును ఇస్తుంది.

ప్రధాన్ మంత్రి నేషనల్ అప్రెంటీస్‌షిప్ మేళాలలో పాల్గొనే సంస్థలు ఉమ్మడి ప్లాట్‌ఫారమ్‌లో అప్రెంటీస్‌లను కలుసుకోవడానికి మరియు అక్కడికక్కడే అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కలిగి ఉంటాయి. ఇంకా, కనీసం నలుగురు ఉద్యోగులతో కూడిన చిన్న తరహా పరిశ్రమలు ఈవెంట్‌లో అప్రెంటిస్‌లను తీసుకోవచ్చు. భవిష్యత్ విద్యాసంబంధ మార్గాల కోసం ఉపయోగించే అభ్యాసకులు సేకరించిన వివిధ క్రెడిట్‌ల డిపాజిటరీతో క్రెడిట్ బ్యాంక్ కాన్సెప్ట్ కూడా త్వరలో ప్రవేశపెట్టబడుతుంది.

స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ ప్రధాన్ మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళాపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ " గత ఏప్రిల్‌లో నిర్వహించిన అప్రెంటీస్‌షిప్ మేళా విజయవంతం కావడంతో ఇకపై ప్రతి నెలా ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా (ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా-పిఎంఎన్‌ఏఎం) నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ మోడల్ నుండి అభ్యర్థితో పాటు సంస్థలు కూడా ప్రయోజనం పొందుతాయని మేము ఆశిస్తున్నాము. ఈ మేళాల ద్వారా పది లక్షల మంది యువతను అప్రెంటిస్‌లుగా చేర్చుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది అభ్యర్థులకు షాప్ ఫ్లోర్‌లపై అనుభవాన్ని అందించడమే కాకుండా స్థానిక స్థాయిలో వలసల సవాలును కూడా పరిష్కరిస్తుంది." అని చెప్పారు.



 

******



(Release ID: 1833433) Visitor Counter : 198